Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5.5శాతం నుంచి 11శాతానికి పెరిగిన నిరుద్యోగరేటు
- సెంటర్ ఫర్ మానిటరింగ్, లేబర్ ఫోర్స్ గణాంకాల్లో వెల్లడి
- పాలకులకు పట్టింపే లేదు : ఆర్థికరంగ శ్లేషకులు
న్యూఢిల్లీ : ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ చేసిన ఎన్నికల వాగ్ధానం ఏడాదికి 'కోటి ఉద్యోగాల' కల్పన. యువతీయు వకుల్లో పెద్ద ఎత్తున ఆశల్ని కల్పించింది. కానీ ఆ ఆశలు అడియాశలయ్యాయి. కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం, ఉపాధిరంగంలో యువతకు దక్కుతున్న అవకాశాలు రోజురోజుకీ క్షీణించాయనే చెప్పాలి. సెంటర్ ఫర్ మాని టరింగ్ (సీఎంఐఈ), లేబర్ ఫోర్స్ (ఎల్బీ) తాజా సర్వేలు ఈ విషయాల్ని గణాంకాల రూ పంలో, గ్రాఫిక్స్రూపంలో స్పష్టం చేస్తున్నాయి.
కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం దారు ణంగా పడిపోయిందన్న అంశం ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మహిళల భాగస్వా మ్యమే కాదు, మొత్తంగా ఉన్నత విద్య పూర్తి చేసుకున్న యువతీ యువకుల పరిస్థితే (మొదటిపేజీ తరువాయి)
దారుణంగా ఉందని ఆర్థిక రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎంఐఈ, ఎల్బీ తాజా గణాంకాలు, నివేదికల ఆధారంగా వారు చేస్తున్న విశ్లేషణ ఇలా ఉంది...
దేశవ్యాప్తంగా పెరిగిన నిరుద్యోగరేటు
దేశంలో చదువుకున్న యువతలో రోజురోజుకీ నై రాశ్యం పెరిగిపోతోంది. కారణం...నిరుద్యోగ సమస్య వారిని తీవ్రంగా వేధించటమే. ముఖ్యంగా సాంకేతిక విద్య పూర్తిచేసుకున్న యువతలో...నిరుద్యోగరేటు 5.5శాతం నుంచి 11శాతానికి పెరిగింది. 2011-12 నుంచి 2015-16 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 2.6శాతం నుంచి 3.2శాతం వరకు పెరిగింది. ఇది అత్యంత ఆందోళన కలిగించే సూచన. కానీ ఈ విషయానికి పాలకులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇదంత పెద్ద విషయం కాదన్నట్టు వారు మెదులుతున్నారు. నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనపై 'జాతీయ నమూనా సర్వే-2017-18' (ఎన్ఎస్ఎస్) నివేదిక ఇంకా విడుదల కాలేదు. ఇది విడుదలైననాడు మరిన్ని విషయాలు బయటకువస్తాయి.
కార్మికశక్తిలో యువత భాగస్వామ్యమూ తగ్గింది
కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గిపో యిందని కొద్ద రోజుల క్రితం 'ఎన్ఎస్ఎస్'సర్వేనే తేల్చింది. అలాగే 2012 తర్వాత యువత పెద్ద సంఖ్యలో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని, ముఖ్యంగా ఉన్నత చదువులు పూర్తిచేసుకున్న యువతీయువకుల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆ సర్వే అభిప్రాయపడింది.
కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం పడిపోవ టం 2016నాటికి తీవ్ర రూపందాల్చింది. దీనికి కారణాలు ఏంటన్నది మేథావులు, ఆర్థికరంగ విశ్లేషకులు, పరిశోధకులు ఎన్నోమార్లు చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయేతర రంగంలో ఉపాధిలేమి ప్రధానంగా ప్రభావం చూపిందని వారు అన్నారు. ముఖ్యంగా పాడిపశువుల పెంపకం గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ తినటం మహిళ ఆదాయాన్ని ప్రభావితం చేసిందని అంటున్నారు.
2005-2012మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో యువత ఉపాధి ఫరవాలేదన్న స్థాయిలో ఉంది. 2012దాటిన తర్వాత ఈ రంగంలో యువత ఉపాధిరేటు పడిపోవటం దేశ చరిత్రలోనే మొదటి సారి. తయారీరంగంలో 30లక్షల ఉద్యోగాలు తగ్గిపో యాయి.
అయితే ఇదేమీ పెద్ద విషయం కాదన్న ట్టుగా అధికార రాజకీయ పార్టీలు వ్యవహరిస్తు న్నాయి. కేవలం సేవారంగంలో ఉద్యోగాల కల్పన పెరిగిందని తెలుస్తోంది. అయితే ఇందులో ఉన్నవి చాలా స్వల్ప వేతనాలతో కూడిన ఉద్యోగాలేనని, అందునా దాదాపు 74 శాతం ఉద్యోగాలు అభద్రత, సామాజిక అభద్రతతో కూడినవేనని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్న మాట. సేవారంగంలో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు కేవలం 18శాతం మాత్రమే.