Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి గిరిరాజ్పై కేసు నమోదు
ముజఫర్పూర్: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరిరాజ్పై కేసు నమోదైంది. ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు సామాజిక కార్యకర్త తమన్నా హష్మి ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని హష్మి ఆరోపించారు. కాగా, ఈకేసును ముజఫర్పూర్ అదనపు మేజిస్ట్రేటు సబా ఆలం నవంబరు 3కు వాయిదా వేశారు. 'ముస్లిం జాతి రాముని వారసులని, వారంతా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముందురావాల'ని గిరిరాజ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్లోని నవాడా లోక్సభ ఎంపీ అయిన గిరిరాజ్..ఉత్తరప్రదేశ్లోని బాఫ్ుపట్ జిల్లాలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.