Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరిత దీపావళి కోసం కృషి చేయండి : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలో అంతకంతకూ పెరి గిపోతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టవల సిన బాధ్యతను గుర్తు చేస్తూ.. దీపావళి పండుగ రోజున కాల్చే పటాసులను రెండు గంటలు మాత్రమే కాల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. దీపావళితో పాటు ఇతర పండుగలప్పుడూ దేశవ్యాప్తం గా భారీగా బాణసంచాను కాల్చుతున్నారు. దీంతో, ఆ కర్భన ఉద్గారాలన్నీ గాలిలో కలిసిపోయి తీవ్ర వాయుకాలుష్యానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో.. వచ్చే దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచాను కాల్చాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతోపాటు, భారీ సేల్స్ పేరిట ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లు ఇష్టారీతిన అమ్మకాలు చేయరాదంటూ జస్టిస్ ఎకె సిక్రి, అశోక్ భూషణ్ల తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సైట్లలో టపాసుల అమ్మ కాలను నిషేధించింది. దేశంలో అందరూ హరిత దీపావళి కోసం కృషి చేయాలని.. ఆదేశాలను ధిక్కరించిన వారిపై కఠినంగా వ్యవహరించా లని పోలీసులకు దిశా నిర్దేషం చేసింది. దీపావళి సందర్భంగా.. ఢిల్లీలో సమూహాలుగా టపాసులు కాల్చే విధానాన్ని (కమ్యూనిటీ క్రాకర్ బ్రాస్టింగ్) అమలుచేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని బాణసంచాను తయారుచేసే సంస్థలకు సూచించింది. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే, పర్యావరణానికి హాని కలిగించని పటాసులను మాత్రమే విక్రయించాలని.. అవి కూడా తక్కువ డెసిబిల్స్ ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది.