Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయ్యప్ప ఆలయంలో సద్దుమణిగిన ఉద్రిక్తత
- ఐదురోజుల హైడ్రామాకు ఆలయం మూతతో తెర
- తాత్కాలికంగా మూతపడినా... వీడని సస్పెన్స్
నవతెలంగాణ-జనరల్ డెస్క్
శబరిమల... అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సు ల మహిళలనూ అనుమతిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థా నం తీర్పునిచ్చాక.. శరణంలో ఎవరిది పైచేయి. ఐదు రోజుల పాటు కొనసాగిన హైడ్రామాకు ఆలయం మూత తో తాత్కా లికంగా తెరపడినా.. ఉద్రిక్తత కొనసాగు తున్నది. హిందూత్వ శక్తుల ముసుగులో అరాచక శక్తులను దింపి మహిళల్ని అయ్యప్ప సన్నిధిలో అడుగుపెట్టకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు వేసిన వ్యూహాన్ని వామపక్ష సర్కారు ఏ విధంగా చెక్ పెట్టింది..?
స్వామిశరణమంటూ భక్తుల రాకతో.. కేరళ రాష్ట్రం భక్తసందోహంతో కనిపించేది. అన్ని వయసుల మహిళలకు అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించిందో అప్పటి నుంచి ఆ రాష్ట్రం రెండుగా చీలిపో యింది. హిందూత్వశక్తులు రోడ్లపైకి వచ్చి.. మహిళల్ని బెదిరించటం.. మీ అంతుచూస్తాం.. అడుగుపెడితే.. అడ్డం గా నరికేస్తామంటూ వారిపైకి రెచ్చిపోయారు. ఆలయంలోకి వెళ్లాలని వస్తున్న మహిళల్ని అడ్డుకుంటుంటే... శాంతి భద్రతలను కాపాడటం.. ఆలయంలోకి వెళ్ళాలనుకున్నవారికి పూర్తి రక్షణ కల్పించడంపై కేరళ సర్కార్ దృష్టిపెట్టింది. పోలీసులు వలయంగా ఏర్పడి మహిళ భక్తులను ఎలాంటి ప్రాణహాని జరగకుండా కాపాడింది పినరరు సర్కార్.
మోడీ సర్కార్ చేసిన కుయుక్తులేంటీ..?
కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమలుచేసిన దురాగతాల అడుగుల్లో కాళ్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నదనటానికి ఎన్నో ఉదాహరణలు. ఎమర్జన్సీని తలపించేలా దేశంలో జరుగుతున్న ఘటనలు కోకొల్లలు. రైతులపై తుపాకులు ఎక్కుపెట్టడం మొదలుకుని, రచయితలను అంతమొందించటం.. జర్నలిస్టులపై హత్యా రాజకీయాలు.. ఇలా చెప్పుకుంటే దాదాపు ఇందిరాగాంధీ అణచివేత రాజకీయాలను మోడీ సర్కారు ఫాలో అవుతు న్నట్టు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అయినా ఎన్డీఏ సర్కార్ అయినా లెఫ్ట్ ప్రభుత్వాలను టార్గెట్ చేయటమే ప్రధాన లక్ష్యంగా కుట్రలూ కుతంత్రాలకు వెనుకాడటంలేదు.
నాటి నిరసనలను తలపిస్తూ..
1959లో 'విముక్తి పోరాటం' పేరుతో మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ గ్రూపును కాంగ్రెస్ రెచ్చగొట్టింది. ఇందుకు ఇందిరాగాంధీ వెనకుండి కథ నడిపించారు. నేటి 'శబరిమల'పై రణం కూడా అధికార పాగా కోసమేనన్నది జగమెరిగిన సత్యం. 1959లో ప్రభు త్వం ప్రతిపాదించిన విద్యా, భూ సంస్కరణలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఓ వర్గం పెద్దఎత్తున ఆందోళనలకు దిగింది. ఇది ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని మొగ్గలోనే తుంచేసేందుకు కేంద్రానికి ఆజ్యం పోసినట్టయింది. ఇప్పుడు 'శబరిమల' అంశాన్ని ముందుకు తెచ్చి రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలకు తెరతీయాలనీ, రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం సృష్టించాలని హిందూ త్వశక్తులు చేయని ప్రయత్నంలేదు. శాంతిభద్రతలను సమస్యగా చూపించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలాగే.. ఇప్ప టి మోడీ సర్కారు కూడా కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనుకున్నది. ఈ ఆందోళన వెనుకదాగిన నిగూఢ రహస్యం ఇదే.
సుప్రీం తీర్పురాగానే బీజేపీ, కాంగ్రెస్ ఏమన్నాయి..?
సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే... అత్యున్నత న్యాయస్థాన తీర్పు అమలుకు కట్టుబడి ఉన్నామని కేరళ సర్కార్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుచేయాలని పట్టుబట్టాయి. రెండు పార్టీలు అసంబద్ధ వాదనను ముందుకు తెచ్చాయి. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామంటూనే.. సాంప్రదాయ ఆచా రాలు, మనోభావాలను గౌరవించాలంటూ రెచ్చగొట్టేందుకు వెనకాడలేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం ఎంతకైనా తెగిస్తామనేలా హిందూత్వశక్తులను ఉసిగొల్పాయి. మరోవైపు రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పును కాపాడేందుకు సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించింది. మహిళ భక్తులపై హిందూత్వభక్తులు అరాచకాలను పాల్పడకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించేలా అక్కడి వామపక్ష ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ధైర్యంగా నారీమణుల ముందడుగు
హైదరాబాద్కు చెందిన కవిత, హక్కుల కార్యకర్త రెహనా ఫాతిమా ఇలా మరికొంత మంది మహిళలు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన ధైర్యంతో అడుగులు ముందుకేశారు. కానీ.. మహిళలెవరినీ ఆలయంలోనికి హిందూత్వశక్తులు అనుమతించలేదు. అయితే ఆలయంలోకి వెళ్ళాలనుకున్న మహిళలకు రక్షణ కల్పిస్తూ పోలీసులు ఎంతో సంయమనం తో వ్యవహరించారు. అవకాశం దొరికినప్పుడల్లా హింసాత్మక ఘటనలకు ప్రయత్నించాయి. పోలీసులు, ప్రభుత్వ ఆస్తులు, జర్నలిస్టులపై రాళ్ళతో దాడుల చేశాయి. ఈ దాడులకు పాల్ప డింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మీడియాలో ఘోషించినా..మోడీ సర్కారు నోరుమెదపలేదు.
పినరరు సర్కార్ ఏం చేసింది..?
ఒక వేళ హిందూత్వశక్తులను బంధనాలు దాటించి.. కనీసం ఒక్క మహిళనైనా ఆలయంలోనికి తీసుకెళ్లటం వామపక్ష సర్కారు అంతకష్టమేమీ కాదు. అలాతెగిస్తే వెం టనే వేటు వేయాలని మోడీ సర్కార్ కాచుకున్నది. పినర రు సర్కారు ముందస్తుగా ఆలోచించి శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పకడ్బందీగా వ్యవహరించింది.
ఆలయం తాత్కాలికంగా మూతపడినా.!
ఐదురోజులపాటు ఉద్రిక్తత చోటుచేసుకున్నాక..ఇపుడు శబరిమల ఆలయం మూతపడింది. ఇక్కడ టెన్షన్ వాతా వరణం కొద్దిరోజులపాటు ఆగినా నవంబరు మధ్యలో శబరి మల యాత్ర సీజన్ ప్రారంభంకానున్నది. అప్పుడు పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు వస్తారు. దాన్ని ఆసరాగా చేసుకొని మతం, కులం, రాజకీయ ఉద్దేశంతో ప్రేరేపించ బడిన నిరసనలకు ఆ రెండు పార్టీలూ పాల్పడవచ్చని అక్కడి నిఘా వర్గాలు హెచ్చరిక చేస్తున్నాయి. మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఎలాగైనా వామపక్ష సర్కార్ ఇరకాటం లో పడేయటం ఎలాఅని తెగమదనపడుతున్నదన్నట్టు సంకే తాలొస్తున్నాయి. మరి పినరరు సర్కార్ ఎన్డీఏ ఎత్తులను ఏవిధంగా తిప్పికొడుతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.