Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్పై నమోదయిన పశుగ్రాసం కుంభకోణం కేసును పర్యవేక్షిస్తున్న పీఎంఓ 'ఉన్నతాధికారి' ఇది రాజకీయ ప్రతీకారంగా పరిగణిస్తారేమోనన్న సందేహం వ్యక్తం చేశారని అలోక్ వర్మ తన లేఖలో వివరించారు. ఈ కేసు తదుపరి విచారణ కొనసాగిస్తుంటే పీఎంఓ ఉన్నతాధికారి పేరు తాను వెల్లడిస్తానని ఆయన సీవీసీకి తెలిపారు. ఆస్తానాపై అవినీతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో సీవీసీ, పీఎంఓలోని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల విభాగం 'అర్ధరాత్రి కుట్ర' పన్ని తనను తొలగించారని వర్మ ఆరోపించారు. దీనితో ఆస్తానాపై కేసు దర్యాప్తు దారి తప్పిందన్నారు. ఆస్తానాపై కేసును విచారిస్తున్న అధికారులను ఒకరిని జబల్పూర్కు, మరొకరిని పోర్ట్ బ్లెయిర్కు బదిలీ చేయ టంతోనే ఇది స్పష్టమైందన్నారు. ఆస్తానా ఫిర్యాదుపై సీవీసీ ప్రారంభించిన దర్యాప్తు అనేక నకిలీ పత్రాల సృష్టికి దారి తీసిందని, ఇది ఆస్తానా వైపు నుంచి కొనసాగుతున్న మరో నేరపూరిత చర్య అని వర్మ తన లేఖలో పేర్కొన్నారు. సీవీసీ, సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ భాగ స్వామ్యంలో వున్న సీబీఐ ఎంపిక కమిటీ ద్వారా నియామక విధానాలకు విరుద్ధంగా కళంకితులైన అధికారులను సిబిఐలో ప్రవేశపెట్టారని, తద్వారా సంస్థ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బ తిన్నదని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా తమకు కావల్సిన అధికారుల నియామకం కోసం సీబీఐ చేసే సూచనలను ఎంపిక కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని, అయితే ఇక్కడ సీబీఐ సూచించిన అధికారుల పేర్లను సిబ్బంది వ్యవహారాలశాఖ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్ధం కావటం లేదని తెలిపారు.