Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సీపీఐ(ఎం) రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 28 స్థానాల్లో పోటీ చేయగా భద్ర, దుంగర్గఢ్ నియోజకవర్గాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది. హనుమాన్గఢ్ జిల్లా భద్ర స్థానం నుంచి బరిలో ఉన్న సీపీఐ(ఎం) అభ్యర్థి బల్వాన్ పూనియా.. బీజేపీ అభ్యర్థి సంజీవ్కుమార్పై ఘన విజయం సాధించారు. బికనీర్ జిల్లా దుంగర్గఢ్లో సీపీఐ(ఎం) అభ్యర్థి గిరిధరిలాల్ మహియా.. కాంగ్రెస్ అభ్యర్థి మంగల్రామ్పై భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) మూడు స్థానాలను దక్కించుకున్నది. ఆ ఎన్నికల్లో సికార్ జిల్లాలోని ధోద్, దంతారామ్గఢ్, శ్రీగంగానగర్ జిల్లాలోని అనూప్నగర్ స్థానాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు విజయం సాధించారు.
గత ఐదేండ్ల కాలంలో ఆ రాష్ట్రంలోని వసుంధరారాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ(ఎం) పలు ఆందోళనలను నిర్వహించింది. రైతుల రుణాలు మాఫీ చేయాలన్న డిమాండ్తో 13 జిల్లాల్లో 13 రోజులపాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించింది. దళితులు, మైనారిటీలపై దాడులకు నిరసనగా ఆందోళనలు నిర్వహించింది.