Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడిటర్స్ గిల్డ్ నిర్ణయం
న్యూఢిల్లీ: లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మాజీ సహాయ మంత్రి ఎంజె అక్బర్ను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) సస్పెండ్ చేసింది. అలాగే ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై కూడా ఇదే చర్యకు ఉపక్రమించింది. ఈ మేరకు ఈజీఐ ఒక ప్రకటనను విడుదల చేసింది. 'ఎంజే అక్బర్పై ఒక మహిళ వేసిన పరువునష్టం దావా కేసు ముగింపునకు చేరేవరకు ఆయనపై సస్పెండ్ ఉంటుంది. మా ఎగ్జిక్యూటివ్ కమిటీలోని మెజారిటీ సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు' అని పేర్కొంది. 'మీ టూ' క్యాంపెయిన్లో భాగంగా దాదాపు 20 మందికి పైగా మహిళలు.. అక్బర్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపించడంతో మోడీ క్యాబినెట్లో కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పదవి నుంచి ఆయన వైదొలిగి విషయం తెలిసిందే. అలాగే తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను కూడా ఈజీఐ సస్పెండ్ చేసింది. 2013లో తోటి ఉద్యోగినిపై లైంగికదాడి చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.