Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యూరోక్రాట్స్తో నింపే ప్రయత్నం చేస్తున్న కేంద్రం :
- మాజీ సీఐసీ శ్రీధర్ ఆచార్యులు, పౌరహక్కుల నేతలు అభ్యంతరం
న్యూఢిలీ:కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)ను, సమాచార హక్కు చట్టాన్ని మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని మాజీ సీఐసీ శ్రీధర్ ఆచార్యులు, పౌర హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఐసీ చీఫ్తో సహా 8మంది కమిషనర్ల నియామకా లపై కేంద్రం తీరును తప్పుబడుతున్నారు. మెజార్టీ పోస్టుల్లో బ్యూరో క్రాట్స్ను నియమించాలన్న మోడీ సర్కార్ ఆలోచ నను శ్రీధర్ ఆచార్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ కూడా రాశారు. రెండేండ్లుగా సీఐసీ నియామకాల్ని పెండింగ్లో ఉంచిన కేంద్రం, ఉన్నపళంగా ఇప్పుడు వేగంగా కదులుతోంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ మంగళవారం సమావేశమై తుది జాబితాను సిద్ధం చేసింది.
ఎంపిక విధానంలో పలు అంశాలపై మోడీ సర్కార్ రాజీ పడిందని, బ్యూరోక్రాట్స్తో సీఐసీని నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. నియామకాలకు సంబంధించి కేంద్రం పత్రికల్లో విడుదలచేసిన ప్రకటన కూడా వివాదాస్పదమైంది. ఆర్టీఐ నిబం ధనల ప్రకారం ఈ ప్రకటన లేదని కొంతమంది పౌ రహక్కుల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సీఐసీ కమిషనర్ల జీతభత్యాలు, అలవెన్సుల వివరాలు, కాలపరిమితి అన్నవి కేంద్రం బయటపెట్టడం లేదని, ప్రజా జీవితంతో విస్త్రతమైన సంబంధాలు, వివిధ రంగాల్లో పేరొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని శ్రీధర్ ఆచార్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సీఐసీ నియామకాల్లో పారదర్శకత పాటించటం లేదని, చాలా రహస్యంగా తుది జాబితా రూపొందించారని విమర్శలు చేశారు.