Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద సాయం వెంటనే ఇవ్వాలి :
- పార్లమెంట్లో సీపీఐ(ఎం), సీపీఐ ఎంపీల ధర్నా
కేరళపై వివక్షత తగదని సీపీఐ(ఎం) లోక్సభ పక్షనేత పి కరుణాకరన్ అన్నారు. కేరళ రాష్ట్రానికి వెంటనే వరద సాయం అందించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో మహాత్మ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ(ఎం), సీపీఐ ఎంపీలు ధర్నా చేశారు. కేరళ పట్ల కేంద్ర ప్రభుత్వ కపట వైఖరి నశించాలని, కేరళను వెంటనే ఆదుకోవాలని, వరద సాయం అందించాలని పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు చేబూని తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా పి.కరుణాకరన్ మాట్లాడుతూ కేరళ పట్ల మోడీ సర్కార్ ద్వంద వైఖరిని అవలంభిస్తున్నని విమర్శించారు. అకాల వరదల కారణంగా కేరళ రాష్ట్రం అతలాకుతలమైందని, ఆదునేందుకు కేంద్రం ముందుకు రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మలయాళీలకు అండగా నిలిచేందుకు ప్రయత్నించని బీజేపీ ప్రభుత్వం, మలయాళీలను మతం పేరుతో విభజన చేసేందుకు మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. రాజ్యాంగం పట్ల తమ రాష్ట్రానికి రావల్సిన నిధులు ఇవ్వటం లేదని, ఇది రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. కేరళకు వచ్చే విదేశీ నిధులను సైతం కేంద్రం కక్షగట్టి నిలిపివేసిందని విమర్శించారు. వెంటనే కేరళకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) లోక్సభ ఎంపీలు శ్రీమతి టీచర్, పికె బిజూ, ఎంబి రాజేష్, ఎ.సంపత్, సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీలు ఎలమరం కరీం, కె.సోంప్రసాద్, కెకె రాగేష్, సీపీఐ ఎంపీలు సిఎన్ జయదేవన్, బినరు విశ్వం, స్వతంత్ర ఎంపీలు విటి ఇనోసెంట్, జోయిస్ జోర్జీ తదితరులు పాల్గొన్నారు.
మూడో రోజూ ఏపీ ఎంపీల ఆందోళన
పార్లమెంటు శీతకాల సమావేశాల మూడో రోజూ విభజన హామీల సాధన కోసం టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. ఆంధ్ర ప్రదేశ్కు విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్లకా ర్డులు పట్టుకొని టీడీపీ, వైసీపీ ఎంపీలు వేర్వేరుగా ఆందోళనకు దిగారు.