Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాఫెల్పై జేపీసీ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
- రైతు సమస్యలపై ప్రభుత్వంలో చలనం లేదు :
- సీపీఐ(ఎం) ఎంపీలు ఎండి సలీం, కెేకే రాగేష్
చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలను కూడా సరిగా నిర్వహించే ఉద్దేశ్యమే మోడీ సర్కార్కు లేదని సీపీఐ(ఎం) లోక్సభ పక్ష ఉపనేత మహమ్మద్ సలీమ్ విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు రోజు మోడీ నేతత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సభను సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధాని పేర్కొన్నారని, కానీ సభను సరైన విధంగా నడిపే ఆలోచనే ఆ పార్టీకి లేదని సలీం విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు కె.కె రాగేష్తో కలిసి ఎండి సలీం మాట్లాడారు. రైతాంగ సమస్యలపై చర్చకు సమయం కేటాయించాలని తాము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీకి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం బాధాకరమన్నారు. అన్నదాతల సమస్యలపై చర్చించేందుకు సమయం కేటాయించాలన్న తమ పార్టీ డిమాండ్ను ప్రభుత్వం కనీసం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదని వివరించారు. రాఫెల్ ఒప్పందంలో అనుమానాలున్నాయని, ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. రాఫెల్పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యవస్థీకతమైన అవినీతిని కొనసాగిస్తూ దేశ సంపదను పెట్టుబడిదారీవర్గాలకు మోడీ ప్రభుత్వం దోచిపెడుతుందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో మోడీ ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదని అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన శివసేనతో కలిసి రాంమందిర అంశాన్ని మరోసారి చర్చనీయాంశం చేస్తున్నారన్నారు. బాబ్రీ మసీదు, రాంమందిర్ వంటి సున్నితమైన అంశాలపై చర్చను లెవనెత్తి సభను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమయాన్ని వృథా చేయకుండా, అన్నదాతల సమస్యలపై చర్చించాలన్నారు. సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు కెకె రాగేష్ మాట్లాడుతూ కేరళలో ఇటీవల సంభవించిన వరదలపై చర్చ జరిపేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరినా అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఇదే విషయంపై తాము అఖిలపక్ష సమావేశంలో ప్రధానికి నివేదించినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కరువు నిధులు మరింత పెంచాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞాపనలు చేసినా, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.