Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ మొదలైన పెట్రో బాదుడు
- ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే..
- పెట్రోల్పై రూ. 0.11 పైసలు పెంపు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో పెట్రో ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రెండో రోజే చమురు ఉత్పత్తుల ధరలు మళ్లీ పెరిగాయి. ఎన్నికల సందర్భంగా రెండు నెలల పాటు కిందికి దిగివచ్చిన పెట్రో ఉత్పత్తుల ధరలు గురువారం మళ్లీ పైకి ఎగబాకాయి. అంతా అనుకున్నట్టుగానే ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని మోడీ సర్కారు పెట్రో ధరలను పెంచింది. గతంలో కర్నాటక ఎన్నికలు జరిగినన్ని రోజులు స్తబ్దుగా ఉన్న పెట్రో ధరలు.. ఎన్నికలు ముగిసిన వెంటనే పైపైకి ఎగబాకాయి. కాగా, ఈ ఏడాది ఆగస్టు మాసాంతంలో మొదలైన పెట్రో వడ్డన.. దాదాపు అక్టోబర్ చివరిదాకా కొనసాగింది. ఒక దశలో దేశంలోని పలు ప్రాంతాలలో మునుపెన్నడూ లేనంతగా పెట్రోల్ ధర రూ. 105 కు చేరుకుంది. డీజిల్ ధరలు కూడా సెంచరీకి చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయినా దిగిరాని మోడీ సర్కారు.. ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలవడంతో పెట్రో రేట్లను తగ్గించింది. కానీ, మూడు రోజుల క్రితం వెలువడిన ఫలితాలు బీజేపీకి షాకిచ్చాయి. దీంతో, పెట్రో ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైంది.
ఢిల్లీలో లీటరు పెట్రోల్పై రూ. 0.09 పైసలు పెరిగింది. సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 70.29 కాగా.. ముంబయిలో 0.11 పైసలు పెరిగి రూ. 75.91 కు చేరుకుంది. ఇక, చెన్నైలో రూ. 0.13 పైసలు పైకి ఎగబాకి రూ. 72.94కు చేరింది. ఇదిలాఉండగా.. డీజిల్ ధరలు మాత్రం గత రెండు రోజులుగా అలాగే ఉన్నాయి.