Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రచారాల కోసం మోడీ సర్కారు భారీ మొత్తం ఖర్చు పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టింది అక్షరాల ఐదు వేల రెండు వందల
కోట్ల రూపాయలని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ వెల్లడించారు. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాథోడ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. మంత్రి వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2014-15లో రూ. 979.78కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం యాడ్స్ కోసం ఖర్చు చేసింది. 2015-16లో రూ.1,160.16 కోట్ల నిధులు, 2016-17లో రూ. 1,264.26 కోట్ల రూపాయలను, 2017-18లో రూ. 1,313.57 కోట్లను ప్రచారానికి మోడీ సర్కారు వెచ్చించింది. కాగా, ఈ ఏడాది డిసెంబర్ 7వరకు పబ్లిసిటీ కోసం రూ. 527.96 కోట్లను కేంద్రం ఖర్చు పెట్టింది. ఈ లెక్కల ప్రకారం.. ప్రచారాల కోసం మోడీ సర్కారు చేసే ఖర్చు ప్రతియేటా పెరుగుతూనే వస్తున్నది. 2014-15 నుంచి ఇప్పటి వరకు ప్రచారానికి కేంద్రం ఖర్చుపెట్టిన మొత్తం రూ. 5,245.73 కోట్లుగా మంత్రి వివరించారు. ఇందులో ముద్రిత(ప్రింట్) అడ్వర్టయిజ్మెంట్ కోసం రూ. 2,282 కోట్లు, ఆడియో లేదా వీడియో రూపంలో రూ. 2,312.59 కోట్లు, ఔట్డోర్ పబ్లిసిటీ కోసం రూ. 651.14కోట్లను ఖర్చుపెట్టినట్టు రాథోడ్ వెల్లడించారు.