Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : రైతులకు రుణమాఫీ చేసేది లేదని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై మాత్రం విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. గత నాలుగన్నరేండ్లలో ప్రధాని మోడీ విదేశీ పర్యటన లపై కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.2014కోట్లు(280 మిలి యన్ డాలర్లు). ప్రజలపై పన్నులు మోపీ వసూలు చేసిన ప్రభుత్వ ధనమిది. పార్లమెంటు లో ఓప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే.సింగ్ ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు వివరాల్ని వెల్లడిం చారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన 84 పర్యట నల కారణంగా భారత పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఈ మేర ఖర్చయ్యిందని తెలిపారు. 'ఎయిరిండియా వన్' విమానాల నిర్వహణ ఖర్చు, సురక్షిత హాట్లైన్ సౌకర్యాలు సహా వివిధ ఖర్చుల కోసం 2,014 కోట్లు వెచ్చించినట్టు ఆయన పార్లమెంట్లో తెలిపారు. ఇందులో ప్రధాని విమానాల నిర్వహణ ఖర్చే రూ.1,583 కోట్లుగా ఉంది. 2014లో ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత ప్రాబల్యానికి ఊపునిచ్చేందుకు, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారని వీకే.సింగ్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే తదితరులతో పలుమార్లు సమావేశం అయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో వుహాన్లో అనధికారిక సమావేశం సహా ఆయన చేసిన కొన్ని పర్యటనలు దౌత్యపరంగా ఫలితాన్ని ఇచ్చాయని అన్నారు. భారత్, చైనా దళాల మధ్య సుదీర్ఘ ప్రతిష్టంభన చోటుచేసుకున్నప్పుడు ప్రధాని మోడీ చైనా పర్యటన శాంతికి దోహదం చేసిందన్నారు.