Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్న వైద్యులు
కోల్కతా : సీపీఐ(ఎం) సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి నిరుపమ్ సేన్ (71) ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆస్పత్రి వైద్యులు శుక్రవారం ప్రకటించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం స్థానిక ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో మాజీ సభ్యులైన నిరుపమ్ సేన్ గతంలో బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా వ్యవహరించారు.