Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రజల ప్రాణాలతో అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ చెలగాటం
- జాన్సన్ బేబీ పౌడర్లో క్యాన్సర్ కారకాలు.. ముందే తెలిసినా దాచిపెట్టిన సంస్థ?!
- పౌడర్తో పాటూ షవర్ ఉత్పత్తుల్లోనూ అస్బెస్టాస్ క్యాన్సర్ కారకాలు..
- లోపభూయిష్ట జాన్సన్ - హిప్ ఇంప్లాట్స్ తో అవస్థల పాలైన రోగులు
- దేశంలో 4,700 హిప్ ఇంప్లాట్స్ సర్జరీలు జరిగితే, పరిహారం కోసం అప్లై చేసింది 1,080 మంది మాత్రమే! అవగాహన లోపమే కారణమా..?
- జాన్సన్ కంపెనీపై ఇప్పటి వరకు10వేలకు పైగా కేసులు.. సంస్థ వైఖరిపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
పసిపిల్లలకు, తల్లులకు మ త్యుపాశంగా.. నాణ్యత లేని సరుకును రోగులకు అంటగట్టిన సంస్థగా.. ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న జాన్సన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ సంస్థ తయారు చేసిన బేబీ పౌడర్ వల్ల తమకు క్యాన్సర్ సోకినట్టు ఇప్పటికే పలువురు మహిళలు వివిధ కోర్టులను ఆశ్రయించారు కూడా. తాజాగా, జాన్సన్ బేబీ పౌడర్లో క్యాన్సర్ కారకాలు ఉన్న విషయం జాన్సన్కు ముందే తెలిసినప్పటికీ, లాభార్జన కోసం ఆ విషయాన్ని సంస్థ దాచిపెట్టిందని రాయిటర్స్ మీడియా సంస్థ పలు పత్రాలను అధ్యయనం చేసి కథనం ప్రచురించడం సంచలనంగా మారింది. తాము తయారుచేసిన బేబీ టాల్కమ్ పౌడర్లో ఆస్బెస్టాస్ అనే క్యాన్సర్ కారకం ఉన్నట్టు 1971లోనే జాన్సస్ సంస్థ గుర్తించిం దని ఆ కథనం పేర్కొంది. ఐతే, ఈ విషయమై సదరు సంస్థ స్పంది స్తూ.. ఇవన్నీ కల్పిత వార్తలని, నిజాన్నితప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను జాన్సన్ చెబుతోంది. కాగా, ఐదు నెలల క్రితం.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్ను వాడడం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చినట్టు దాఖలైన పిటిషన్ను విచారిస్తూ.. అమెరికా మిస్సోరీ కోర్టు జాన్సన్ కంపెనీపై రూ.32వేల కోట్లు ఫైన్ వేయడం విదితమే! జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్లో అస్బెస్టాస్ ఉన్నట్టు పరిశోధనలో తేలడం.. దాని వల్లే ఒవేరియన్ క్యాన్సర్ వ్యాప్తి చెందినట్టు రుజువవ్వడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అంతేనా, జాన్సన్ బేబీ పౌడర్తో పాటు షవర్ ఉత్పత్తుల్లోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటూ జాన్సన్ కంపెనీపై ఇప్పటికే, 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
లోపభూయిష్ట హిప్ ఇంప్లాట్స్
బేబీ పౌడర్, షవర్ ఉత్పత్తులే కాదు వృద్దులు, ప్రమాదాల్లో గాయపడిన రోగులకు ఉపయోగించే హిప్ ఇంప్లాట్స్ లో సైతం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తన కక్కుర్తిని చూపించినట్టు తెలుస్తోంది. జాన్సన్ తయారు చేసిన హిప్ ఇంప్లాట్స్ పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. హిప్ ఇంప్లాట్స్ తయారీలో లోపభూయిష్ట విధానాన్ని అనుసరించడం, నాణ్యతలో రాజీ పడటమే దీనికి కారణం. విమర్శల నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చిన హిప్ ఇంప్లాట్స్ ను 2010లో జాన్సన్ రీకాల్ చేసింది. ఐతే, అప్పటికే, కొంత మంది జాన్సన్ తయారుచేసిన హిప్ ఇంప్లాట్స్ ను అమర్చుకోవడం, అవస్థలు పడటం జరిగింది. భారతదేశం నుంచి సుమారు 1,080 మంది రోగులను బాధితులుగా గుర్తించిన అధికారులు ఒక్కొక్కరికి కోటి ముప్పై లక్షలు చెల్లించాల్సిందిగా నిర్ణయించారు. బాధితులకు పరిహారం అందించే విషయంలో నిపుణల కమిటీ సూచించిన విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడాన్ని సవాల్ చేస్తూ జాన్సన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పరిహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పెండింగ్లో ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. కాగా, ఈ కేసులో సంస్థ వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
నమ్మలేని నిజాలు
- 2004 -2010 కాాలంలో మన దేశంలో 4,700 జాన్సన్ హిప్ ఇంప్లాట్స్ సర్జరీలు జరగ్గా, కేవలం 1,080 మంది రోగులు మాత్రమే పరిహారం కోసం దరఖాస్తు చేస్తుకున్నారు. అవగాహన లోపమే దీనికి కారణంగా తెలుస్తోంది.
- జాన్సన్ బేబీ పౌడర్లో క్యాన్సర్ కారకాలు కేసులో.. బాధితురాలైన ఓ మహిళకు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల ఫైన్ చెల్లించాలంటూ అమెరికా కోర్టు జాన్సన్ కంపెనీని ఆదేశించింది.
- జాన్సన్ బేబీ పౌడర్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో అమెరికా మార్కెట్లో శుక్రవారం జాన్సన్ అండ్ జాన్సన్ షేరు విలువ 10శాతం మేర పడిపోయింది. 16ఏండ్లలో కంపెనీ షేర్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.