Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రాఫెల్ తీర్పు'లో చారిత్రక తప్పిదం జరిగిందా !
- తీర్పును సవరించాలంటూ కేంద్రం అఫిడవిట్..
- మోడీ సర్కారు కావాలనే పక్కదారి పట్టించిందా ?
- యుద్ధ విమానాల ఒప్పందంపై సరికొత్త అనుమానాలు'రాఫెల్ తీర్పు'లో చారిత్రక తప్పిదం జరిగిందా !
- తీర్పును సవరించాలంటూ కేంద్రం అఫిడవిట్..
- మోడీ సర్కారు కావాలనే పక్కదారి పట్టించిందా ?
- యుద్ధ విమానాల ఒప్పందంపై సరికొత్త అనుమానాలు
రాఫెల్ కుంభకోణంపై సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇస్తూ ఇచ్చిన తీర్పు వెనుక వ్యూహాత్మక కుట్ర జరిగినట్టు విమర్శలొస్తున్నాయి. శుక్రవారం నాడు వెల్లడించిన తీర్పును సవరించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో మోడీ సర్కారు శనివారం దాఖలు చేసిన అఫిడవిట్ ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. రాఫెల్ యుద్ద విమానాల డీల్పై తాము సమర్పించిన వివరాలను తప్పుగా అర్థం చేసుకున్నారని సుప్రీంకోర్టుకు తెలపడం చర్చనీ యాంశంగా మారింది. ఒప్పందంపై కాగ్ నివేదిక ఇచ్చిందని గానీ, దానికి పార్ల మెంటు ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) ఆమో దం లభించిందని గానీ తాము చెప్పలేదని పేర్కొన్నది. రక్షణ విభాగానికి సంబంధించిన కీలక వ్యవహారంలో సుప్రీంకోర్టు పొరపాటు చేసిందా ? లేదంటే తప్పుడు వివరాలు సమర్పించి బీజేపీ ప్రభుత్వం.. న్యాయస్థానంతో, దేశ ప్రజలతో పరిహాసమాడిందా ? అన్నది
చర్చనీయాంశమైంది.
న్యూఢిల్లీ : వైమానిక దళానికి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం సరైందేనని, దీనిపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చారిత్రక తప్పిదం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ తప్పిదానికి ప్రధాన కారణం కేంద్రమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, అనిల్ అంబానీ కంపెనీకి లబ్ది చేకూరేలా కేంద్రం కుట్రలు పన్నిందని అటు పార్లమెంటులోనూ, ఇటు దేశవ్యాప్తంగా రచ్చగా మారిన విషయం విధితమే. కాగా.. ఈ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో జరిపించాలని సుప్రీంకోర్టులో 36 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గోగోరు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై మోడీ సర్కార్ సరైన సమాధానమివ్వడం లేదు. ఈ నేపథ్యంలో డీల్కు శుక్రవారం గ్రీన్ సిగల్ ఇస్తూ పిటిషన్లన్నింటినీ కొట్టివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు.. ఈ తీర్పును ఆసరాగా చేసుకొని బీజేపీ రాజకీయ లబ్ది పొందేలా ఎదురుదాడికి దిగింది. అనిల్ అంబానీతో పాటు దస్సాల్ట్ కంపెనీ యాజమాన్యం వారు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి జీన్ యేవ్స్ లీడ్రెయిన్ కూడా భారత పర్యటనకు వచ్చారు. ఇదిలాఉంటే తీర్పునిచ్చి సరిగ్గా 24 గంటలు గడవక ముందే కేంద్రం.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తీర్పును సవరించాలని కేంద్రం కోరడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నది.
సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది..
రాఫెల్ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాఫెల్ ఒప్పందంపై ఎలాంటి సందేహాలు లేవని పేర్కొంటూ ఇలాంటి వ్యవహారాల్లో న్యాయసమీక్ష అధికారం పరిమితమేనని తేల్చి చెప్పింది. ఈ ఒప్పందంలో వాణిజ్య సంస్థకు లబ్ది చేకూరేలా కేంద్రం వ్వవహరించిందనడానికి సాక్ష్యాధారాలేవీ లేవని స్పష్టం చేసింది. దాంతోపాటు విమాన ధరల వివరాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి నివేదిక ఇచ్చిన విషయాన్ని కేంద్రం తమకు తెలియజేసిందని చెప్పింది. అంతేకాక.. కాగ్ నివేదికకు పీఏసీ కూడా ఆమోదం తెలిపిన తర్వాత ఇంకా సందేహాలు ఎందుకని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలోని దర్యాప్తు అవసరమే లేదని తేల్చి చెప్పింది. కాగా.. కోర్టు ఇచ్చిన తీర్పుతో పీఏసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే కాగ్కు ఫోన్ చేసి తమకు నివేదిక ఇచ్చారా? అని ప్రశ్నించారు.
నివేదికను ఇవ్వలేదని, తయారు చేస్తున్నట్టు కాగ్ సమాధానమిచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. కాగ్ తన నివేదకను రూపొందించే క్రమంలోనే ఉన్నదని, వచ్చే ఏడాది జనవరిలో దీన్ని పీఏసీకి సమ ర్పించే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సహా విపక్షాలు.. కేంద్రాన్ని ఎండగడు తున్నాయి. రాఫెల్పై కేంద్రం కావాలనే తప్పుడు సమాచా రమిచ్చి.. ఉన్నత న్యాయస్థానాన్ని మోసం చేసిందని ఆరోపిస్తున్నాయి.
కోర్టుపై
నెట్టివేసేలా బీజేపీ సర్కారు యత్నం
కాగ్ నివేదికపై దుమారం లేచిన తరుణంలో కేంద్రం సరికొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. రాఫెల్ విమానాల ధరలకు సంబంధించి.. సీల్డ్కవర్లో సమర్పించిన వివరాలను కోర్టు తప్పుగా అర్థం చేసుకున్నదని వింత వాదనను తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు తీర్పు సందర్భంగా.. రాఫెల్ ఒప్పందంపై కాగ్ నివేదక ఇచ్చిందని, దానికి పీఏసీ ఆమోదం లభించిందని ధర్మాసనం చెప్పిన విషయాలను సవరించాలని కోరింది. సీల్డ్ కవర్లో అందించిన నివేదికలో తాము కాగ్, పీఏసీ ప్రస్థావన తేలేదని, సాధారణంగా ధరల వివరాలు, ఒప్పంద ప్రక్రియను మాత్రమే పేర్కొన్నామని కేంద్రప్రభుత్వం తన అఫిడవిట్లో తెలిపింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు తప్పుగా అర్థం చేసుకున్నదని వివరించింది. కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కేంద్రం వివరాలు సమర్పించనిదే.. కాగ్, పీఏసీల ప్రస్థా వనను ధర్మాసనం ఎందుకు లేవ నెత్తిందన్న ప్రశ్నలు రేకెత్తుతు న్నాయి. కేంద్రం కుట్రపూరితంగా తప్పుడు వివరాలను సమర్పించి.. ఇప్పుడు కోర్టు తప్పిదమని బుకాయిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. మరోవైపు.. తమకు నివేదిక అందనే లేదని, కానీ, దానికి తాము ఆమోదం తెలిపినట్టు సుప్రీంకోర్టు ఎలా తీర్పునిచ్చిందని ఖర్గే ప్రశ్నించారు. కేంద్రం తప్పుడు వివరాలు సమర్పించి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. దీనికి మోడీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రివ్యూ పిటిషన్ వేయొచ్చు..:
బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి
రాఫెల్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మల్లిఖార్జున ఖర్గే అఫిడవిట్ లేదా రివ్యూ పిటిషన్ దాఖలు చేయవచ్చని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. నిజంగానే కాగ్ నివేదిక పీఏసీకి అందకపోతే, దానిపై పరిశీలన చేయకపోతే ఆ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అధికారం ఖర్గేకు ఉందని తెలిపారు. ఈ తీర్పు సవరణ వ్యవహారంపై ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు రెండే దారులున్నాయి. కేంద్రం సీల్డ్కవర్లో అందించిన నివేదికను అర్థం చేసుకోవడంలో తమ పొరపాటు జరిగిందని ధర్మాసనం ఒప్పుకోవాలి. లేదంటే కేంద్రమే తప్పుడు వివరాలు సమర్పించి తమను తప్పుదోవ పట్టించిందని చెప్పడంతో పాటు తగు చర్యలకు ఉపక్రమించాలి.