Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహ వేడుకకు హాజరు
నవతెలంగాణ -
న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ కుమా రుడు మయాంక్ వివాహానికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎర్రవల్లిలో నిర్వహిస్తున్న మహా చండీయాగం నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీలు కేశవరావు, బోయినపల్లి వినోద్ కుమార్, సంతోష్, బండ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. వధూవరులను శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించే సమయంలో కేంద్ర హౌంమంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు అక్కడే ఉన్నారు. అక్కడున్న కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులను మర్యాదపూర్వకంగా పలకరించి, కాసేపు మాట్లాడిన సీఎం కేసీఆర్, అక్కణ్ణుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు.