Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రి పూట మైనింగ్లోకి మహిళలకు సర్కారు 'అనుమతి'
- ఈ నిర్ణయంతో స్త్రీ శ్రమ దోపిడీ : శ్రామిక సంఘాలు
- లైంగిక వేధింపులు పెరుగుతాయని ఆందోళన
న్యూఢిల్లీ : గనుల్లో పనిచేసే మహిళా కార్మికులకు పని గంటలపై ఉన్న ఆంక్షలను మోడీ సర్కారు సడలించింది. వారు రాత్రిళ్లూ గనుల్లో పనిచేయవచ్చని 'అనుమతి' ఇచ్చింది. భూ ఉపరితలం(ఓపెన్ కాస్ట్ సహా)పై రోజులో ఏ షిఫ్టులోనైనా పనికి దింపొచ్చునని, భూమి లోపల మెనింగ్ పనుల కోసం మహిళలను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పంపించవచ్చునని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 'గనుల్లో మహిళలకు సమాన ఉపాధి అవకాశమ'ని విడుదలైన ఈ నోటిఫికేషన్పై శ్రామిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో సమాన అవకాశం కాదు గానీ మహిళల శ్రమ మరింత దోపిడీకి గురవుతుందని విమర్శిస్తున్నాయి.
మైనింగ్ రంగంలో అధిక శ్రమ దోపిడీ :
సాధారణంగా కార్మికుల శ్రమ దోపిడీలో మహిళల శ్రమ దోపిడీ వాటా ఎక్కువగా ఉంటుంది. వారి వేతనం పురు షులకంటే తక్కువగా ఉంటుందనేది తెలిసిన విషయమే. ఇదిలా ఉండగా, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ శ్రమ దోపి డీ జరిగే, అత్యంత ప్రమాదకరమైన మైనింగ్ సెక్టార్లో మహిళలకు పని గంటలపై నిషేధాన్ని ఎత్తివేయడమంటే.. కార్మికురాలిగా, మహిళగా వారి శ్రమను మరింత అధికంగా దోపిడీకి గురిచేయడమనే పలువురు అభిప్రాయపడు తున్నారు.
ప్రాణాంతక ప్రమాదాలూ ఎక్కువే
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న తరహా మైనింగ్ వృద్ధిపై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) చేసిన ఓ అధ్యయనం(1999)లో.. ప్రమాదపుటంచుల్లో గనికార్మికు లున్న దేశాల్లో తొలిమూడు స్థానాల్లో భారత్నూ పేర్కొనడం గమనార్హం. ప్రపంచ శ్రామిక శక్తిలో గని కార్మికుల వాటా ఒక్క శాతమే అయినా.. పనిప్రాంతాల్లో ప్రాణాంతక ప్రమాదాలకు గురవుతున్నవారిలో ఐదు శాతం(ఏడాదికి 15వేల మంది) ఈ రంగంవారేనని ఈ అధ్యయనం వెల్ల డించింది. ఇలాంటి రంగంలో మహిళలకు రాత్రిపూట పనికి అవకాశం కల్పించడమంటే మృత్యు ఒడిలోకి వారిని తోసేసి నట్టేనన్న చర్చ నడుస్తోంది. అయితే మహిళల అంగీకారం తీసుకున్నాకే వారికి రాత్రిపూట పనికల్పిస్తామనీ ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. కానీ ఆర్థిక అవసరాలు, ఒత్తిళ్లతో మైనింగ్ పనులు చేస్తున్న మహిళకు ఆమె సమ్మతి అనేది అర్థరహితం. కాగా, ఇది వారిని మరింత శ్రమ దోపిడీ చేసేందుకు తోడ్పడవచ్చు.
మహిళల ఆరోగ్యంపై ప్రభావం
ఐఎల్ఓ ప్రకారం.. రాత్రి పూట ఏ పనిచేసినా వారి ఆరోగ్యం క్షీణిస్తుందని చెబుతోందని, ప్రత్యేకంగా మహిళల విషయంలో ఇది తీవ్రంగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయని వాయిస్ ఆఫ్ ద వర్కింగ్ విమెన్ సంపాద కులు, సీఐటీయూ నేత రంజన నిరులా తెలిపారు. పురుషు లు రాత్రిళ్లు పనిచేసినా పగటిపూట పడుకోవచ్చు గానీ, ఇంటిపనుల రీత్యా వారికి మధ్యాహ్నంపూట నిద్రించడం కుదరదని చెప్పారు. శరీర ధర్మాలు, పునరుత్పత్తి, అందుకు సంబంధించిన బాధ్యతల రీత్యా పురుషులకుండే సౌకర్యం మహిళలకు ఉండదని తెలిపారు. 'సమానం అంటే ఒకేలా అని కాద'ని వివరించారు.
లైంగిక వేధింపులూ పెరగవచ్చు
గనుల్లో రాత్రిపూట పనిచేసే మహిళలు లైంగిక వేధిం పులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రంజన నిరులా తెలిపారు. వేధింపులు సర్వసాధారణంగా మారు తున్న పరిస్థితుల్లో.. పురుషులు ప్రాబల్యం అధికంగా ఉండే గనుల్లో మహిళలు రాత్రిళ్లు పని చేస్తే లైంగిక వేధింపులు, దాడులు ఎక్కువగా జరిగే అవకాశముంటుందని వివరిం చారు. ముగ్గురి కంటే ఎక్కువ మహిళలతో బృందాలుగా రాత్రిళ్లు పని చేస్తారని నోటిఫికేషన్ చెబుతున్నా.. పురుషుల సంఖ్యతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారని చెబుతూ.. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పని కల్పిస్తున్నారని విమర్శించారు.