Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: కాలానికనుగుణం గా జీవనశైలిలో వస్తున్న మార్పులతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నా యని, వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఏర్కొన్నారు. సీపీఐ(ఎం) తొలితరం నాయకుల్లో ఒకరైన కాజ సాంబశివరావు పదో వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో గురువారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్ధంతి సభకు రైతు సంఘం నాయకులు కాజ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ పాలకపక్షాలు ప్రభుత్వరంగ ఆసుపత్రులను విస్మరించి కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ప్రజాధనాన్ని ప్రయివేటు ఆసుపత్రులకు కట్టబెడుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాజ సాంబశివరావు రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం పోరా డారని, గ్రామంలో పేదలపక్షాన నిలబ డి పనిచేసిన నిస్వార్థ నాయకుడని చెప్పారు. సాంబశివరావు అమెరికన్ తెలుగు ప్రొగెసివ్ అసోసియేషన్ (ఆప్తా) ప్రజలకు వైద్యం అందించాలనే ఆశయంతో ఆయన కుమారుడు కాజ వెంకటేశ్వరరావు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు.