Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : విద్య, ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్ కోరుతూ రాజస్థాన్లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళన ఎనిమిదో రోజుకు చేరింది. గుజ్జర్ల నిరసనలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలే ఆ బిల్లును పాస్ చేసినా వీరి ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. దీంతో, రోడ్డు, రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆందోళనల కారణంగా ఢిల్లీ ముంబయి మధ్య నడిచే 64 రైళ్లను రద్దు చేశారు. 71 రైళ్లను దారి మళ్లించగా 32 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఉత్తర రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర సమ్మతి కోసం పంపినట్టు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు.