Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాసింగ్అవుట్ పరేడ్లో మహమూద్ అలీ
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
శాంతి భద్రతల పరిరక్షణ, నేరస్తుల జాడను కనిపెట్టడంలో సుశిక్షితమైన పోలీసు జాగిలాలు కీలక పాత్రను పోషిస్తున్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. వీటికి అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ నివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం అవసరమైన నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. మోయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమి(ఐఐటీఏ) లో జరిగిన 18వ బ్యాచ్ పోలీసు జాగిలాల శిక్షణానంతర ముగింపు కవాతుకు హోంమంత్రి శుక్రవారం ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఆ దిశగా పోలీసులు చేస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు. వారికి అవసరమైన విభాగాలలో పోలీసు జాగిలాలు, వాటిని నిర్వహించే హాంగ్లర్స్ల విధులు సైతం మంచి మద్దతు నిస్తున్నాయని పేర్కొన్నారు. జాగిలాలలకు, హాంగ్లర్స్కు అవసరమైన శిక్షణను ఇవ్వడంలో ఈ అకాడమి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చడంలో రాష్ట్రసర్కారు ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ మాట్లాడుతూ... పోలీసుశాఖ పటిష్టత కోసం ప్రభుత్వం నుంచి మంచి సహకారం లభిస్తున్నదన్నారు. ఈ సారి మొత్తం 582 జాగిలాలు, 832 మంది హాంగ్లర్స్కు ఏడాది పాటు శిక్షణను ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. పోలీసుశాఖకు వీరు అందుబాటులోకి రావడంతో ఇటు నేర విచారణ అటు సెక్యూరిటీ విధులకు బలం చేకూరినట్టుయ్యిందని అన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజి నవీన్చంద్ మాట్లాడుతూ... ఈ అకాడమిలో ఇప్పటి వరకు 74 బ్యాచ్లు శిక్షణ పొందాయని తెలిపారు. ఈ మారు బీహార్, గోవాలకు చెందిన పోలీసు జాగిలాలు, హాంగ్లర్స్కు కూడా శిక్షణ నివ్వడం జరిగిందన్నారు. ప్రధానంగా వీవీఐపీల భద్రతకు మరింతగా ప్రాధాన్యతను ఇచ్చి అందులో జాగిలాలకు ప్రత్యేక శిక్షణను ఇవ్వడం జరిగిందన్నారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఐజీ ఎంకె సింగ్ మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో మోయినాబాద్ ఐఐటీఏ అకాడమిని తీర్చిదిద్దే కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపిస్తున్నామని చెప్పారు. అంతకు ముందు 532 పోలీసు జాగిలాలు, వాటి హాంగ్లర్స్ల శిక్షణానంతర ముగింపు కవాతు ఆకర్ష ణీయంగా సాగింది. అనంతరం పోలీసుల జాగిలాలు తాము వివిధ అంశాలపై పొందిన శిక్షణలపై చూపిన డెమో కూడా ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం ఇందులో ప్రతిభను కనబరిచిన జాగిలాలు, హాంగ్లర్స్కు హోంమంత్రి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ దామోదర్గుప్తా, ఎండీ మల్లారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తదితర ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.