Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోంను మరో కాశ్మీర్ కానివ్వం : అమిత్ షా
లఖింపూర్ : అసోంను మరో కాశ్మీర్గా మారనివ్వమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఇక్కడ జరిగిన ర్యాలీలో అమిత్ షా మట్లాడుతూ 'పాకిస్తాన్ ఉగ్రవాదులు దారు ణంగా దాడికి పాల్పడ్డారు. జవాన్ల త్యాగం వృథా కానివ్వం, ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. భద్రతా అంశంపై బీజేపీ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు' అని తెలిపారు. 'అసోంను మరో కాశ్మీర్గా మారనివ్వం. అందువల్లనే ఎన్ఆర్సీ తీసుకునివచ్చాం. ఎన్ఆర్సీ సహాయంతో ప్రతీ చొరబాటుదారుడ్ని దేశం నుంచి వెనక్కి పంపిస్తాం' అని తెలిపారు. పౌరసత్వ (సవరణ) బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టలేకపోవడంపై అమిత్ షా మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈ బిల్లును మరొకసారి తీసుకుని వస్తారని చెప్పారు. ఈ బిల్లు కేవలం ఈశాన్య ప్రాంతాలకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఉన్న శరణార్థులందరికీ ఈ బిల్లు వర్తిస్తుందని అమిత్ షా తెలిపారు. పౌరసత్వ బిల్లుతోనే అసోం జనాభాలో మార్పు వస్తుందని, లేకపోతే అసోం ప్రజలు పెద్ద ప్రమాదంలో పడిపోతారని అమిత్ షా తెలిపారు. అలాగే కాంగ్రెస్, అసోమ్ గణ పరిషద్పై కూడా అమిత్ షా విమర్శలు చేశారు. అసోం ఒప్పందం కుదిరిన 1985 నుంచి ఎక్కువ కాలం ఇక్కడ అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు చేసింది ఏమీ లేదని అన్నారు.