Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: ఘనా దేశ యువరాజు ఒహేనెబా యా ఓట్చరి ఆధ్వర్యంలో ఆ దేశ ప్రతినిధుల బృందం రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరప్రదేశ్లోని సహార షహర్ను సందర్శించింది. ఈ సందర్భంగా సహార ఇండియా పరివార్ సంస్థ చైర్మెన్ సుభ్రతా రారు సహారాను కలుసుకున్నట్టు ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. ఆ సంస్థ చైర్మెన్కు మెడల్ను, ఓ జ్ఞాపికను అందజేసినట్టు వెల్లడించింది. ఇది నాయకత్వ లక్షణాలకు, గొప్పదనానికి, ప్రజలకు చేసిన సేవలకు ప్రతీకగా ఆ సంస్థ పేర్కొన్నది. అనంతరం ఆయనను ఘనా రాజు పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో భారత్లో ఘనా దేశ హైకమిషనర్ ఒక్వాయే మిచేలారాన్, లండన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కమలేష్ కుమార్ పటేల్ తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారని తెలిపింది.