Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'శారదా'లో సీబీఐ ప్రశ్నించిన కొద్దిరోజులకే స్థాన చలనం
కోల్కతా: కోల్కతా పోలీస్బాస్ రాజీవ్కుమార్ బదిలీ అయ్యారు. ఆయనకు అడిషనల్ డైరెక్టర్ జనరల్, ఐజీ (నేర పరిశోధన శాఖ)గా ప్రభుత్వం పోస్టింగ్ను ఇచ్చింది. కోల్కతాత పోలీస్ కమిషనర్గా ఆయన మూడేండ్లు విధులు నిర్వహించారు. కాగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయనను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆయన స్థానంలో కోల్కత కమిషనర్గా అనుజ్శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ప్రస్తుతం పశ్చిమబెంగాల్ శాంతిభద్రతల అదనపు డీజీగా పనిచేస్తున్నారు. కాగా శారదా చిట్ఫండ్స్్ కేసులో కమిషనర్ రాజీవ్కుమార్ను విచారించడానికి ప్రయత్నించగా ఆయనకు మద్దతుగా సీఎం మమతా బెనర్జీ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతను మానసికంగా దెబ్బతీయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. అందుకే ఎన్నికల నేపథ్యంలో మమత దూకుడును తగ్గించాలంటే ఆమెకు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయాలని వారు ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దానిలో భాగంగానే కోల్కత కమిషనర్ను బదిలీ చేయాలంటూ ఢిల్లీ పెద్దలపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒత్తిడి తీసుకువచ్చినట్టు వినికిడి. కాగా శారదా చిట్ఫండ్ కేసులో ఆధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై సీబీఐ ఆయనను విచారించేందుకు ప్రయత్నించింది. కాగా కోల్కతా పోలీసులు ప్రతిఘటించి సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకుని వదిలి వేశారు. కాగా విచారణకు సహకరించాలని రాజీవ్ను సుప్రీం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను మేఘాలయాలో ప్రశ్నించిన విషయం తెలిసిందే.Q