Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి:
- టీఏపీఆర్పీఏ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంచిర్యాల జిల్లా శ్రీరామ్పూర్లో 2018, ఫిబ్రవరి 27న జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న బొగ్గు పింఛనర్లు అర్ధనగ ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆల్ పింఛనర్లు, రిటైర్డ్ పర్సిన్ల సంఘం (టీఏపీఆర్పీఏ) అధ్యక్షులు పి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత వైద్య వసతులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు పింఛనర్ల పింఛన్ నెలకు రూ.8,500 చెల్లించాలని కోరారు. రెండు పడక గదుల ఇల్లు ఇవ్వాలనీ, తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయాలనీ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ కోరుతూ ఈనెల 27న కొత్తగూడెం, ఇల్లందు, గోదావరిఖని, శ్రీరామ్పూర్లలోని సింగరేణి కార్యాలయాల వద్ద అర్ధనగ ప్రదర్శన చేస్తారని చెప్పారు. హామీల అమలుకు తగిన ఆదేశాలను సింగరేణి యాజమాన్యానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బొగ్గు పింఛనర్లు రూ.350, కొందరు కుటుంబ పింఛన్ రూ.80తో దారిద్రంలో ఉంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఏపీఆర్పీఏ నాయకులు సిహెచ్ సత్యనారాయణ, కె మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.