Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బికనీర్ కలెక్టర్ ఆదేశాలు
జైపూర్ : పాకిస్థానీయులు 48 గంటల్లోగా వెళ్లిపోవాలంటూ రాజస్థాన్లోని బికనీర్ జిల్లా కలెక్టర్ కుమార్పాల్ గౌతమ్ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆయన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత జిల్లాలో ఆందోళనలు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ఆదేశాలు రెండు నెలలపాటు అమల్లో ఉండనున్నాయి. అంతేకాక.. పాక్ దేశస్తులకు హోటళ్లలో, ఇతర ప్రాంతాల్లో నివాస వసతి కల్పించవద్దని, ఆఖరుకు వారిని ఆస్పత్రుల్లో కూడా చేర్చుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దాంతోపాటు పాకిస్థానీలకు ఉద్యోగాలు ఇవ్వకూడదని, వారితో ప్రత్యక్ష, పరోక్ష వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. పాకిస్థాన్ ఆధారిత సిమ్ కార్డులపైనా కలెక్టర్ నిషేధం విధించారు.
కర్ఫ్యూ పాక్షికంగా సడలింపు
మరోవైపు.. జమ్మూ నగరంలో విధించిన కర్ఫ్యూను మంగళవారం రెండు గంటల పాటు సడలించారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా శుక్రవారం జమ్మూలో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చారు. కాగా.. మంగళవారం 11.30 నుంచి 1.30 వరకు కర్ఫ్యూను సడలింపజేసిన అధికారులు.. తర్వాత ఆంక్షలను తిరిగి కొనసాగించారు.
ఇచ్చట కాశ్మీరీలకు అనుమతి లేదు : హోటల్ ముందు వెలిసిన పోస్టర్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీరీలను లక్ష్యంగా చేసుకొని దేశంలో ఆందోళనలు తలెత్తుతున్నాయి. కాశ్మీరీలపై దాడులు చేస్తామని పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిని విదేశీయులుగా ముద్ర వేసే యత్నాలు జోరందుకున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ హోటల్ ముందు 'కాశ్మీరీలకు అనుమతి లేదు' అనే పోస్టర్ తీవ్ర చర్చకు దారి తీస్తున్నది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతున్నాయి. నవ నిర్మాణ సేన జాతీయ అధ్యక్షుడు అమిత్ జానీ తన హోటల్ ముందు ఈ బోర్డు పెట్టడం గమనార్హం.. గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి విగ్రహ ధ్వంసం, జేఎన్యూ విద్యార్థి నేతపై దాడి ఘటనల్లో అమిత్ జాని ప్రయేమున్నట్టు ఆరోపణలున్నాయి.
'బారుకాట్ కాశ్మీర్' : మేఘాలయ గవర్నర్ వివాదాస్పద ట్వీట్
అత్యంత గౌరవప్రదమై న స్థానంలో ఉన్న ఆయన బాధ్యతగా ఉండాల్సింది పోయి వివాదాస్పద రీతిలో స్పందించారు. 'మొత్తం కాశ్మీర్ను బహిష్కరించండి' అంటూ ఆర్మీ మాజీ అధికారి ఒకరు చేసిన ట్వీట్ను మేఘాలయ గవర్నర్ తథాగతారారు సమర్థించడం తీవ్ర దుమారం రేపుతున్నది. 'జమ్మూకాశ్మీర్లోని అమర్ నాథ్కు రెండేండ్లపాటు ఎవరూ వెళ్లకూడదు. అంతేకాదు.. కాశ్మీరీ వర్తకుల నుంచి ఏమీ కొను గోలు చేయవద్దు. కాశ్మీరీని మొత్తం బహిష్కరిం చండి' అని పేర్కొంటూ ఆర్మీ మాజీ అధికారి ట్వీట్ చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలకు తథాగతారారు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. తథాగతారారును గవర్నర్ పదవి నుంచి తప్పించాలని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. తథాగతా రారు లాంటి వ్యక్తులు.. కాశ్మీరీలు లేని కాశ్మీర్ను కోరుకుంటున్నారా? అని మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా ప్రశ్నించారు.