Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నాసిక్ నుంచి ముంబయి వరకు ఆల్ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) ఆధ్వర్యంలో చేపట్టిన రెండోదఫా లాంగ్ మార్చ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనలో పాల్గొనేందుకు బయలుదేరిన నేతలను మార్గమధ్యంలోనే అడ్డుకోవడంతో నాసిక్లో నిర్వహించే సత్యశోధక్ షట్కారి సభ కూడా రద్దైంది. ధూలే జిల్లాలోని పిపల్నర్ ప్రాంతం నుంచి మార్చ్లో పాల్గొనేందుకు వస్తున్న రైతులను కూడా అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. కాగా, రైతులు, గిరిజనులు, కౌలు రైతులతో సహా సుమారు 80వేల మంది నాసిక్ నుంచి ముంబయికి రెండో దఫా లాంగ్ మార్చ్ను ప్రారంభించారు. ఫిబ్రవరి 27 నాటికి వారంతా ముంబయికి చేరుకోవడంతో ఈ లాంగ్ మార్చ్ ముగుస్తుందని ఎఐకెఎస్ ప్రకటించింది. అయితే గతేడాది నిర్వహించిన రైతుల ఆందోళనతో భీతిల్లిన ప్రభుత్వం వారి డిమాండ్లను ఆమోదిస్తూ వ్రాతపూర్వక హామీని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది గడుస్తున్నా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతో రైతులలో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోయాయని ఎఐకెఎస్ తెలిపింది. కాగా, రైతుల రుణమాఫీ, పంటలకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం కలిపి కనీస మద్దతు ధరగా ప్రకటించాలని, అలాగే అటవీ హక్కుల చట్టం కింద ఆ భూములను రైతులకు కేటాయించాలని ఎఐకెఎస్ డిమాండ్ చేస్తోంది. అలాగే రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.