Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3.14లక్షల కోట్ల చమురుశుద్ధి ప్రాజెక్టుపై నీలినీడలు
- మరోచోటుకు తరలిస్తున్నామన్న ఫడ్నవీస్ ప్రభుత్వం
- శివసేన కోసం... మోడీ సర్కార్ నిర్ణయం
ముంబయి : మహారాష్ట్రలో మోడీ సర్కార్ నిర్మించాల నుకుంటున్న భారీ చమురుశుద్ధి కర్మాగారం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక్కడ రత్నగిరి జిల్లాలో తీర ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మించడానికి 2016లో మోడీ సర్కార్ సిద్ధమైంది. అయితే అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగూ పడలేదు. 44 బిలి యన్ డాలర్ల (సుమారుగా రూ.3.14లక్షల కోట్లు) పెట్టుబ డులతో కూడిన ఈ భారీ రిఫైనరీ ప్రాజెక్టులో సౌదీ అరేబియా కు చెందిన చమురు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత పర్యటనలో ఈ అంశం ప్రస్తావనకు రానున్నదని సమాచారం.
ప్రతిపాదిత ఈ ప్రాజెక్టుపై రత్నగిరి జిల్లాలో స్థానిక రైతులు, పర్యావరణవేత్తల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చింది. అయితే వీరి అభ్యంతరాల్ని నివృత్తి చేసే ప్రయత్నాలేవీ కేంద్రం చేయలేదు. ప్రాజెక్టు నిర్మాణంపై ముందుకెళ్తామనే సంకేతాలే ఇచ్చింది. అయితే సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీయే మిత్రపక్షం శివసేన ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతులు, స్థానికులు నుంచి వ్యతిరేకత వస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఓట్లు...సీట్లు ప్రభావితం అవుతాయని బీజేపీ, శివసేన భావిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టునే మరోచోటకు తరలిస్తున్నామని ఫడ్నవీస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
ప్రాజెక్ట్ స్థలం ప్రకటించలేదు..
ఈ ప్రాజెక్టును ఏ ప్రాంతానికి తరలించారన్న సంగతి మాత్రం ఫడ్నవీస్ ప్రభుత్వం వెల్లడించటం లేదు. ప్రాజెక్టు స్థలాన్ని ప్రకటిస్తే అక్కడకూడా రైతాంగం, స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో, ఎన్నికలయ్యేంత వరకూ విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రఖ్యాత కన్సెల్టెంట్ కంపెనీ ఎఫ్జీఈ, సింగపూర్లో నిపుణుడుగా పనిచేస్తున్న శ్రీపారావైక్కరాసు మాట్లాడుతూ, ''ఇప్పుడు ఈ ప్రాజెక్టు భవితవ్యం పూర్తిగా రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. భారత ఇంధన అవసరాలకు ఈ ప్రాజెక్టును పూర్తిచేయటం చాలా అవసర''మని అన్నారు.