Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా ఆరో రోజు..
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు వరుసగా ఆరో రోజూ పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర రూ.0.11 పైసలు, డీజిల్ ధర రూ. 0.07 పైసలు పెరిగింది. గత నెలలో వరుసగా పదిహేను రోజుల పా టు పెరిగిన చమురు ఉత్పత్తుల ధరలు.. తర్వాత స్తబ్దుగా ఉన్నాయి. కాగా, మళ్లీ ఆరు రోజుల నుంచి ఇంధన ధరలు ఎగబాకుతున్నాయి. పెరి గిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71 వద్ద.. డీజిల్ రూ.66.17 వద్ద కొనసాగుతోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబ యిలో పెట్రోల్ ధర రూ.76.64 వద్ద ఉండగా డీజిల్ ధర రూ.69. 30గా నమోదైంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 75 మార్క్ దాటి రూ.75.34 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.71.95 కి చేరింది.