Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శ
త్రిస్సూర్ : తన మార్కెటింగ్ కార్యకలాపాలకు, టీవీ వార్తాపత్రికలలో వాణిజ్య ప్రకటనలకు ప్రధాని మోడీకి ఎవరు నిధులు అందిస్తున్నారో దేశంలోని యువత ప్రశ్నించాలని రాహుల్ గాంధీ కోరారు. గురువారం త్రిస్సూర్లోని త్రిప్రయార్ వద్ద జాతీయ మత్స్యకారుల పార్లమెంటును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ దేశంలోని 15 మంది వ్యాపార వేత్తల కోసం మాత్రమే పనిచేస్తున్నారని, వారి ప్రయోజనాలు కాపాడుతూ, దేశంలోని భూములను, ఆస్తులను దోచుకునేందుకు అనుమతినిస్తున్నారని విమర్శించారు. దేశంలోని ప్రధాన ఓడరేవులన్నీ ప్రధాని మిత్రులకు అప్పగించారని, వారు మత్స్యకారుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.