Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజిత్ జోగి సంచలన నిర్ణయం
రాయ్ పూర్: ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం అజిత్ జోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని.. ఆయా స్థానాలను బీఎస్పీకి వదిలేస్తున్నట్టు అజిత్ జోగి తెలిపారు. సరైన వనరులు, సంసిద్ధత లేనందున తన పార్టీ ఈ లోక్సభ ఎన్నికల బరిలో పాల్గొనడం లేదని అజిత్ జోగి పేర్కొన్నారు. 'నన్ను పోటీ చేయమని చాలా మంది కోరుతున్నారు. కానీ ఆ విషయంపై నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పార్టీని బలమైన ప్రాంతీయ శక్తిగా మార్చడంపైనే పూర్తి ద ష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నాను. బీఎస్పీ తరఫున రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంపై కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేద'ని జోగి వివరించారు.