Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి సిఎస్ శివాలి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హుబ్లిలోని ప్రయివేటు ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మరణించారు. గురు వారం రాత్రి తీవ్ర జ్వరం రావడంతో శివాలిని ఆయన కుటుంభసభ్యులు అదే రోజు రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. శివాలి మృతిపై రాష్ట్ర ముఖ్య మంత్రి హెచ్డి కుమారస్వామి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. దర్వాడ్ లో రెండు రోజుల క్రితం ఓ భవంతి కూలిపోయిన సందర్భంగా అక్కడ ఆయనను కలిశాననీ, కానీ ఇంతలోనే ఆయన మరణవార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దర్వాడ్ జిల్లా కుండ్గల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివాలి.. సిద్ధరామయ్య మంత్రివర్గంలోనూ మంత్రిగా పనిచేశారు. ఆయన మరణం కాంగ్రెస్కు తీరని లోటు అని సిద్ధరామయ్య తెలిపారు.