Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తన పార్టీ వైఖరిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ స్పష్ట చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ప్రశ్నించారు. పాక్లోని బాలాకోట్పై వైమానిక దళాలు జరిపిన దాడుల్లో ఎంతమంది చనిపోయారనే దానిపై కేంద్రం తగిన ఆధారాలు చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో జవానుల త్యాగాలను కాంగ్రెస్ అవమానించిందనీ, జాతీయ భద్రతపై అనుమానాలు రేకెత్తించిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పేరుపొందిందని, అయితే ఇవి జాతీయ ప్రయోజనాల కంటే ఎక్కువా అనే ప్రశ్నకు రాహుల్ సమాధానమివ్వాలని అన్నారు.