Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నివేదికకు ఈసీ ఆదేశం
రానాఘత్(పశ్చిమబెంగాల్) : పశ్చిమబెంగాల్లో హింసాత్మకం గాజరుగుతున్న ఎన్నికల్లో మరో కలకలం రేగింది. తృణమూల్ ప్రాబల్యమున్న నదియా జిల్లాలోని రానాఘత్ లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఇన్ఛార్జిగా వున్న నోడల్ అధికారి ఆర్నాబ్ రారు హఠాత్తుగా అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. ఎన్నికల విధుల్లో భాగంగా క్రిష్ణానర్లోని అతని ఇంటి నుంచి గురువారం బయటకు వచ్చారు. అయితే ఆదే రోజు మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించట్లేదని జిల్లా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే అతని వాహనం బిప్రదాస్ పాలిటెక్నిక్ కళాశాల పోలింగ్ బూత్ బయట పార్క్ చేయబడి ఉందని అన్నారు. అతను చివరగా శాంతిపూర్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. అనంతరం అతని రెండు సెల్ఫోన్లు సిచ్ఛాప్ అయ్యాయని పేర్కొన్నారు. దీంతో అతని ఆచూకీ కనుగొనడం చాలా కష్టంగా మారిందని అన్నారు.
పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు, కొన్ని రోజుల క్రితం ఎన్నికల విధులకు సంబంధించి అర్నాబ్ రారుకు తన ఇంటి పక్కన ఉండే నదియా జిల్లా మేజిస్ట్ట్రేట్ సుమిత్ గుప్తా మధ్య కొన్ని విబేధాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై గుప్తాను సంప్రదించగా ఆయన దీనిని ఖండించారు. తమ మధ్య ఎటువంటి గొడవ జరగలేదన్నారు. అర్నాబ్ రారు మిస్సింగ్కు సంబంధించి జిల్లా అధికారులు, రారు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నివేదిక పంపాలని ఎన్నికల సంఘం జిల్లా అధికారులను ఆదేశించింది. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా రానాఘట్ స్థానానికి ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి.