Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యావరణ మార్పులపై అంతర్జాతీయ వర్క్షాపులో వక్తలు
న్యూఢిల్లీ : హిమాచల్ప్రదేశ్లోని ఐఐటీ మండి.. పర్యావరణ మార్పులపై అంతర్జాతీయస్థాయిలో వర్క్షాపును నిర్వహిస్తున్నది. పర్యావరణ మార్పులు, హిమాలయాల్లో వాతావరణ పరిణామాలపై ఈ నెల 18న మొదలైన ఈ వర్క్షాప్ నేటి(20వ తేదీ)తో ముగియనున్నది. ఈ కార్యక్రమంలో వక్తలు గ్లోబల్ వార్మింగ్పై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లోని హిమాలయాలు గ్లోబల్ వార్మింగ్కు సెన్సిటివ్ హాట్స్పాట్ల వంటివని పేర్కొన్నారు. హిమాలయాలపై భూతాపం ప్రభావం కనిపి స్తున్నదని తెలిపారు. వర్క్షాపు ప్రారంభోత్సవంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్సైన్స్ కార్యదర్శి డాక్టర్ ఎం రాజీవన్ మాట్లాడుతూ.. గ్రీన్హౌజ్ వాయువుల విడుదల వల్ల పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ముప్పు ఏర్పడుతున్నదని .అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం కనిపిస్తున్నదని, మండిలాంటి కొండిపాంతాల్లో దీని పరిణామాలు మరింత స్పష్టం కనిపిస్తాయని తెలిపారు. పర్యావరణ మార్పులతో తినే ఆహారం, నీరు, శక్తి వనరులూ ప్రభావితమవుతాయని వివరించారు. గత కొన్నేండ్లుగా హిమాలయాల వాతావరణంలో విపరీత మార్పులు సంభవిస్తున్నాయని అన్నారు. డేటాను పరిశీలిస్తే.. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత రోజులు పెరిగాయని తెలుస్తున్నదని చెప్పారు. పర్యావరణంలో ఏర్పడే తీవ్ర మార్పులతో మంచుగడ్డలు కరగడం, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటంలాంటి విపత్తులు సంభవిస్తాయి. ఈ వర్క్షాపులో భారత్ సహా ఐరోపా, అమెరికా దేశాల నుంచి నిపుణులు పాల్గొన్నారు. ఈ వర్క్షాపును ఐఐటీ మండి, కాలిఫోర్నియాలోని చాప్మన్ వర్సిటీ సహా పలుసంస్థలు స్పాన్సర్ చేశాయి.