Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెప్పపాటులో 15 మంది మృతి
- ప్రయివేటు వోల్వో బస్సు-తూఫాన్ వాహనం ఢ
- నిశ్చితార్థానికి వెళ్లొస్తుండగా ఘటన
- గద్వాల జిల్లా రామాపురంలో విషాదఛాయలు
వారంతా ఒకే కుటుంబం.. బంధువులు.. వివాహ నిశ్చితార్థానికి వెళ్లి సంతోషంగా తిరుగు ప్రయాణమైన వారి బతుకులను రెప్పపాటులో వోల్వో బస్సు ఛిద్రం చేసింది. బైక్ను తప్పించబోయిన బస్సు తూఫాను వాహనాన్ని ఢకొీట్టడంతో 15 మంది మృతిచెందారు. మృతులంతా రైతులు, వ్యవసాయ కూలీలే. ఈ ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నవతెలంగాణ- వడ్డేపల్లి
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామస్తులు తుఫాన్ వాహనంలో అనంతపురం జిల్లా గుంతకల్లుకు వివాహ నిశ్చితార్థానికి వెళ్లారు. తిరిగి గద్వాలకు వస్తున్నారు. అదే సమయంలో వోల్వా బస్సు బెంగళూరు వెళ్తోంది. వెల్దుర్తి క్రాసింగ్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయిన బస్సు తుఫాన్ వాహనాన్ని ఢకొీంది.
దీంతో వాహనంలో ఉన్న గోపి(23), తిక్కయ్య(48), చింతలన్న(65), నాగరాజు(38) చిన్నసోమన్న(45), భాస్కర్(38), పాగులన్న, రంగన్న, రాముడు(50), విజరు(30), రంగస్వామి(40), సురేష్(25)తోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్పై వెళ్తున్న వారిలో మసూం అనే వ్యక్తి మృతిచెందాడు. తీవ్ర గాయాలైన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు తుఫాన్ వాహనంలో 17నుంచి 20 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వోల్వా బస్సు తాకిడికి వాహనం నుజ్జునుజ్జయింది. మృతదేహాలను బయటకు తీయడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో రామాపురం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
కేసీఆర్, చంద్రబాబు దిగ్భ్రాంతి రోడ్డు ప్రమాదం విషయం తెలిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య మందించాలని వైద్యాధికారులను ఏపీ సీఎం ఆదేశించారు. వారికి తక్షణ సాయం అందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంకకు కేసీఆర్ సూచించారు.