Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2,021కోట్లా లేక 393 కోట్లా
- మోడీ, ఆయన మంత్రుల ప్రయాణ ఖర్చుల వివాదం
- రాజ్యసభ.. ఆర్టీఐలకు పొంతనలేని లెక్కలు
బీజేపీ ప్రభుత్వం అధికార పీఠం ఎక్కిన 2014 నుంచి పదవీ కాలం ముగిసే వరకూ ప్రధాని నరేంద్రమోడీ, ఆయన సహచర మంత్రుల ప్రయాణ ఖర్చులు ఎంత? ఈ ప్రశ్నకు మోడీ సర్కార్ వద్ద సరైన సమాధానం లేదా? లేక కావాలనే అబద్ధాలాడుతున్నదా..? ఎందుకని ఒకసారి 2,021 కోట్లనీ, మరోసారి రూ.393 కోట్లని ప్రభుత్వం సమాధానమిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన మోడీ ప్లస్ క్యాబినెట్ టూర్ల ఖర్చు మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ముంబయి : మోడీ సర్కార్ కీలకమైన సమాచారాన్ని దాచిపెట్టాల నుకున్న ప్రతిసారి వివాదస్పదమవుతున్నది. అది రాఫెల్ మొదలు కుని మోడీ,క్యాబినెట్ టూర్ల వివరాలు ఇలా ఎన్నో అంశాల్లో బీజేపీ సర్కార్ అబద్ధాలాడుతున్నదన్న వాదనలకు బలంచేకూరుస్తున్నాయి. తాజాగా 2014 మే నుంచి ప్రధాని, అతని సహచర మంత్రుల విదేశీ ప్రయాణ ఖర్చులు (ఎఫ్టీఈ), స్వదేశీ ప్రయాణ ఖర్చులు (డీటీఈ) వివరాలను వెల్లడించాల్సిందిగా ఆర్టీఐ కార్యకర్త అనీల్ గల్గోనీ ప్రశ్నను సంధించారు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం రూ.393 కోట్లు. అయితే 2018 డిసెంబరు నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో... రాజ్యసభలో టూర్ల అంశంపై సభ్యుడు అడిగిన.. ఓ ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన టూర్ల ఖర్చు లెక్కలు అక్షరాల రూ.2021 కోట్లు. 2014 జూన్ నుంచి ప్రధాన మంత్రి పర్యటనలు, చార్టర్డ్ విమానాలు, ఎయిర్క్రాఫ్ట్, హాట్లైన్ సౌకర్యాలకు ఇంత మొత్తం ఖర్చయినట్టు రాజ్యసభ సాక్షిగా ప్రభుత్వం ప్రకటించింది. అలీన్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులు విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చు రూ. 263 కోట్లుగా పేర్కొనగా, రూ. 48 కోట్లను స్వదేశీ ప్రయాణ ఖర్చులుగా క్యాబినెట్ వ్యవహారాల సీనియర్ ఎకౌంట్స్ అధికారి సతీశ్ ఘోయల్ తెలిపారు. అలాగే సహాయ మంత్రుల విదేశీ ప్రయాణ ఖర్చు రూ.29 కోట్లు, స్వదేశీ ప్రయాణ ఖర్చులు రూ.53 కోట్లుగా సమాధానం ఇచ్చారు. ఇందులో 2014-15లోనే ప్రధానమంత్రి,
ఆయన సహచరుల విదేశీ ప్రయాణాలకు అత్యధికంగా రూ.88 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు. అయితే ఎవరి ఖర్చు ఎంత అన్న వివరాలపై స్పష్టతను ప్రభుత్వం ఇవ్వలేదు. అన్ని వివరాలను విడివిడిగా చూపించటంలేదనీ, ఇది 'పారదర్శకత లేమి'ని కండ్లకు కడుతుందని అనీల్ విమర్శించారు. 'ప్రయాణ ఖర్చులపై పూర్తి వివరాలు ఇవ్వలేదు. అంటే పారదర్శకత లేదు. ప్రతీ ఒక్క మంత్రీ పర్యటనల సంఖ్య, వారి ప్రయాణ ఖర్చులకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండాలి' అన్నారు. 'ప్రధాన మంత్రి స్వదేశీ ప్రయాణానికి సంబంధించిన ఖర్చుల వివరాలు తమ వద్ద విడిగా లేవంటూ గతంలో అనీల్ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు పీఎంఓ తెలిపింది.