Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి:జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్
అమరావతి :'రాజకీయాల్లో మార్పు మొదలైంది. అది అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. జనసేన గొప్ప ఆశయంతో పనిచేస్తుంది. పార్టీ బలాన్ని తక్కువగా అంచనా వేయొద్దు' అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని, అందుకు గ్రామస్థాయిలో నిర్మాణంపై శ్రద్ధ వహించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులతో మంగళగిరిలోని ఓ రిసార్ట్స్లో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు, పోలింగ్ సరళి తదితర అంశాలను నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని, దానిలో భాగంగా స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ తయారు చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. పిఆర్పీ సమయంలో చాలామంది ఆశతో వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీకి మాత్రం ఆశయాలతో ముందుకు వచ్చారన్నారు. నాకు ఓటమి భయంలేదు, ఫలితం ఎలా ఉంటుందనే భయం లేదు. ఎన్ని సీట్లు వస్తాయనే అంశం మీద దృష్టి పెట్టలేదని పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఎంత పోరాటం చేశామన్న అంశం మీదే నా ఆలోచన. మార్పు కోసం మహిళలు చాలా బలంగా నిలబడ్డారు. గెలుస్తారా? లేదా?అనే అంశం పక్కన పెట్టి భయపడకుండా వచ్చి ఓట్లు వేశారని ఆయన అన్నారు. రాజకీయాల్లో సహనం, ఓపిక అవసరమని, గుండె ధైర్యం కూడా కావాలన్నారు. 2014లో జనసేన పార్టీ స్థాపించే సమయంలో ఎన్ని సీట్లు వస్తాయనే ఆలోచనే రాలేదన్నారు. నేను ఓటమి లోతులనుంచి బయటకు వచ్చానని, నాకు నిగ్రహం-నియమం వంటివి ఉన్నాయన్నారు. ఎక్కడో ఒక చోట మార్పు రావాలని మాత్రమే ఆలోచించానని అన్నారు. పార్టీ నిర్మాణమంటే పదవులు ఇవ్వడం కాదనీ, కొత్త తరాన్ని తయారు చేస్తున్నామనీ, అంతా ఓ భావజాలానికి అలవాటు పడాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. పవన్కళ్యాణ్ రాజకీయ సలహాదారు పి.రామ్మోహన్రావు మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ గౌరవించాలని నేతలకు సూచించారు. ఈనెల 23న కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లు తగు జాగ్ర త్తలు తీసుకోవాలని, ఏజెంట్ల నియామకాల్లో జాగ్రత్తలు పాటించాల న్నారు. పలు నియోజకవర్గాల్లో వెయ్యి, ఐదొందలు ఓట్లు తేడాతో గెలు పోటములు వచ్చే అవకాశాలున్నాయని, జాగ్రత్తగా ఏజెంట్లు పరిశీలిం చాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మెన్ మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు.