Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు సానుభూతి పరుల ఇండ్లల్లో సోదాలు
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
దండకారణ్యం మొదలుకుని గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో మావోయిస్టులకు అండగా నిలుస్తున్న ప్రాంతాలలో ఇకపై సాయుధ మVహిళా కమాండో లతో సోదాలను నిర్వహించనున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా రెండు నుంచి మూడు బెటాలియన్ల వరకు తొలి విడత ప్రయత్నంలో సీఆర్పీఎఫ్ బలగా లకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు. వీరికి అవసరమైన కఠిన శిక్షణను కూడా ఇస్తన్నారు. సాధా రణంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలోనే మావోయి స్టులకు పట్టుందని , వారి అండదండలతోటే కొత్త రిక్రూట్మెంట్లను చేసుకుంటు తమ బలాన్ని దండ కారణ్యంలో మావోయిస్టులు పెంచుకుంటున్నారని నిఘా వర్గాల నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారం ఉంది. సీఆర్పీఎఫ్ సాయుధ బలగాలు సోదాలను కొనసాగించినప్పుడు మహిళలపట్ల అస భ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
వీటిపై మానవహక్కుల సంఘాలు సైతం వెంటనే స్పందించి పోరాటాలు చేయడమే గాక, కోర్టులలో పిటీషన్లు వేయడం సీఆర్పీఎఫ్ అధికారులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో గిరిజన ఏజెన్సీ ప్రాంతాల లోని ఇండ్ల సోదాలు చేసే సమయంలో మహిళా కమాండోలను వినియోగించడం వలన ఏ సమస్యా ఉండదని ఉన్నతాధికారులు తలపోస్తున్నారు. ఇందు లో మెజారిటీగా సీఆర్పీఎఫ్లో నేరుగా రిక్రూట్ చేసుకున్న మVహిళతో పాటు మరి కొంత శాతం మాజీ మహిళా మావోయిస్టులను చేర్యుకుంటున్నా రని సమాచారం. వీరిని ఆయా ఏరియాలలో కూంబింగ్కు పంపించే ముందు ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారాన్ని సేకరించి వాతావరణం అనుకూ లంగా ఉందని తెలిస్తేనే దళాలను ముందుకు కదలించాలని అధికారులు ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చారని సమాచారం. ఇక్కడి నుంచి మొదలు ఇటు తెలంగాణా ప్రాంతాలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతా లలో సైతం మహిళా కమాండోలతో సోదాలు ముమ్మరంగా నిర్వహించడానికి రంగం సిద్ధం అవుతు న్నట్టు తెలిసింది. ఈ విధానం వలన గిరిజన ఏజెన్సీ లలో ఖాళీగా ఉన్న యువతులు, మVహిలకు ఉపాది óని కల్పించడం, వారి కుటుంబసభ్యులకు స్యయం ఉపాధి అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం వంటి చర్యలు కూడా చేపట్టి ఆకర్షిస్తు న్నారని తెలిసింది. బాంబులను కనిపెట్టడం, అవస రమైతే వాటిని నిర్వీర్యం చేయడం వంటి అంశాల లోను వారికి తర్ఫీదును ఇస్తున్నారని తెలిసింది.