Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులను ఆదేశించిన జమ్ముకాశ్మీర్ హైకోర్టు
శ్రీనగర్ : మూడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడి ఘటనకు నిరసనగా కాశ్మీర్ లోయ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో.. ఈ దురాగతాన్ని జమ్మూకాశ్మీర్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. శుక్రవారం నాటికి ఈ ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)కి చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ లైంగికదాడి ఘటన ఈ నెల 8న బందిపోరాలోని త్రెహగ్రాంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సోపోర్, అనంత్నాగ్, గందేర్బాల్, బందిపోరా, శ్రీనగర్ జిల్లాల్లోని విద్యార్థులు నిరసన చేపట్టడంతో అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కళాశాలలను మూసివేశారు. బాధిత చిన్నారి లైంగికదాడికి గురైందని వైద్య పరీక్షలో తేలడంతో నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు ఉన్నాతాధికారి తెలిపారు.