Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ ప్రచార ర్యాలీలో మోడీ
పాట్నా : ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని, మళ్లీ తానే ప్రధాన మంత్రిని అవుతానని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడో దఫా లోక్సభ ఎన్నికల కోసం బీహార్లోని పాలిగంజ్లో ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటి వరకు ముగిసిన ఆరుదశల ఎన్నికలలో మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపడానికి ఇక్కడకు వచ్చానని ఆయన అన్నారు.
అలాగే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్ కూటమిపై ఆయన విమర్శలు చేశారు. కులం పేరుతో గెలవాలని కొందరు ఢిల్లీలో ఆలోచన చేస్తున్నారని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ ప్రధాని అయిన తర్వాత తూర్పు బీహార్లో అభివృద్ధిని తీసుకొస్తానని తెలిపారు. కాగా, బీహార్లో తన చివరి ప్రచార కార్యక్రమాన్ని మోడీ ముగించుకున్నారు. రాష్ట్రంలో పాట్నసాహిబ్, పాటలీపుత్ర, అర్ర, బక్సార్, నలందా, శాశారాం, కారాకట్, జహానాబాద్ లకు ఏడోదశలో భాగంగా 19న ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో పై ఎనిమిది స్థానాల్లోనూ గెలిచిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి ఇప్పుడు ఆ నియోజకవర్గాలే కీలకం కానున్నాయి.