Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రాఫెల్' కీలక పత్రాల లీక్పై కేంద్రం
న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందానికి సంబంధించి అత్యంత రహస్య పత్రాలు బయటకు లీక్ అయిన ఘటనపై అంతర్గత విచారణ జరుగుతోందని రక్షణశాఖ వెల్లడించింది. కీలక పత్రాల్ని ఎవరో ఎత్తుకెళ్లారన్నదానిపై తీసుకున్న చర్యలేంటో తెలపాలనీ దాఖలైన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం పైవిధంగా స్పందించింది. ముంబయికి చెందిన సమాచరహక్కు కార్యకర్త అనిల్ గాల్గాలి ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం మే7న సమాధానమిచ్చింది. కీలక పత్రాల దొంగతనం ప్రధాని మోడీకి, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్కు తెలుసునా? పోలీస్ ఫిర్యాదు నమోదైందా? అన్నదానిపై అనిల్ గాల్గాలి తన ఆర్టీఐ దరఖాస్తులో సమాచారం కోరారు. ఆర్టీఐ దరఖాస్తుకు రక్షణశాఖ డిప్యూటీ సె కటరీ(వైమానికదళం) సుశీల్ కుమార్ సవ ూధానమిచ్చారు. కీలక సమా చారం బయటకు లీక్ అవ్వటంపై ర క్షణశాఖ అంతర్గత విచారణ జరు పుతోందని తెలిపారు. అయితే కేంద్రం విడుదల చేసిన సమాచారంపై అనిల్ గాల్గాలి అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి సమాచారాన్ని విడుదల చేయలేదని ఆయన అన్నారు.