Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్: ప్రధాని మోడీ చండీగఢ్ సభలో విద్యావంతులు వినూత్న నిరసనకు దిగారు. మోడీ సభకు 'పట్టభద్రుల వేషధారణ'లో వచ్చిన వారు 'మోడీ పకోడాలు' అంటూ అరుస్తూ వాటిని అమ్మేందుకు ప్రయత్నించారు. కాసేపటికే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. '12 మంది విద్యార్థులను మేం అదుపులోకి తీసుకున్నాం. మోడీ సభ ముగిసిన తర్వాత వారిని విడుదల చేశాం' అని సెక్టార్ 34 స్టేషన్ హౌస్ ఆఫీసర్ బల్దేవ్ కుమార్ చెప్పారు. ' ఒక వ్యక్తి పకోడీలు అమ్మి రోజుకు రూ.200 సంసాదిస్తే అది ఉద్యోగం కాదా? అని మోడీ వ్యాఖ్యానించారు. పకోడా యోజన కింద మోడీ మాకు కొత్త ఉద్యోగాలు ఇచ్చినందుకు ఆయనకు స్వాగతం పలికేందుకు మేం అక్కడకువెళ్ళాం. విద్యావంతులైన యువకులు పకోడాలు విక్రయించడం ఎంత గొప్ప పనో ప్రధానికి తెలియచేయాలని నిర్ణయించుకున్నాం. ఆయనకు పకోడీలతో కృతజ్ఞతలు తెలియజేసేందుకే వచ్చాం' అని నిరసనలో పాల్గొన ఓ యువతి వ్యాఖ్యానించింది. గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ 'పకోడీ ఆందోళన'కు దిగినట్టు విద్యావంతులు తెలిపారు.