Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు భారతీయులు మృతి
ఖాట్మాండ్: నేపాల్ భూభాగంలోని కాంచన గంగ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు ప్రమాదవశాత్తు చనిపోయారు.ఈ దుర్ఘటన గురువారం రాత్రి చో టుచేసుకుంది. ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనగంగాను ఎక్కే సమయంలో 8 వేల మీటర్ల ఎత్తులో చనిపోయినట్టు స్థానిక అధికారులు తెలిపారు. మృ తు లు కోల్కతాకు చెందిన విప్లవ్ వైద్య (48), కుంటాల్ కర్నార్ (46)గా గు ర్తిచారు. పర్వతాన్ని అధిరోహించే క్రమంలో వీరిద్దరూ సముద్రమట్టం 8వేల మీటర్ల ఎ త్తులో ఉండగా మరణించారని పసంగ్ షెర్పా అనే వ్యక్తి వెల్లడించాడు. వీ రు మటేన్ హైకింగ్ కంపెనీకి చెందిన ఉద్యోగులని తెలిసింది. కాంచనగంగ పూర్తి ఎత్తు 8,586 మీటర్లు (28,169 అడుగులు) ప్రపంచంలో ఎత్తైన శిఖరాల్లో మూడోది.