Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్లో ఒక్కరోజు ముందే ప్రచారం నిలిపివేతపై సీపీఐ(ఎం)
కోల్కతా : ఘర్షణల నేపథ్యంలో బెంగాల్లో నిబంధనల కంటే ఒక్కరోజు ముందే ఎన్నికల పార్టీలు ప్రచారం నిలిపివేయాలని ఆదేశించిన ఎన్నికల కమిషన్ (ఈసీ) తీరును సీపీఐ(ఎం) తప్పుబట్టింది. ఈ నిర్ణయంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ), బీజేపీలకు ఎలాంటి నష్టం చేకూరదని.. ఇతర పార్టీలే నష్టపోతాయని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. మిశ్రా ఆరోపించారు. బెంగాల్లో ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు చేశారు. ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసిందని.. కానీ ఎన్నికలు మొదలైనప్పట్నుంచీ బెంగాల్లో ఘర్షణ పూరిత వాతావరణమున్నా పట్టించుకోలేదన్నారు. ఈసీ విఫలమవడంతో రాష్ట్రంలో ప్రజలు భయానక వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలను కొన్ని ప్రయివేటు ఛానెళ్లు టీఎంసీ-బీజేపీల మధ్య జరుగుతున్న యుద్ధంలా అభివర్ణిస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మిశ్రా అన్నారు. కాగా, చివరిదశలో భాగంగా బెంగాల్లో మిగిలిన ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. గురువారంతో అక్కడ ప్రచారానికి తెరపడింది.