Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఎగ్జిట్పోల్స్లో ఒక్కో సంస్థ ఒక్కో విధమైన అంచనాలు వెల్లడించాయి. సర్వేల పేరుతో ఆయా సంస్థలకు వచ్చిన సమాచారాన్ని ప్రకటించాయి. వీటిల్లో తొమ్మిది సంస్థలు వైసీపీకి అనుకూలంగా అంచనాలు ఇచ్చాయి. మూడు సంస్థలు టీడీపీకి అనుకూలంగా నివేదికలు వెల్లడించాయి. ఎలైట్, రాజగోపాల్కు చెందిన ఆర్జి ఫ్లాష్, ఐఎన్ఎస్ఎస్ మీడియా సంస్థలు టీడీపీకి మెజార్టీ సీట్లు వస్తాయని చెప్పగా ఆరా, రీసెర్చ్ ఎఫ్ఎక్స్, విడిపి అసోసియేట్స్, ఇండియా టుడే-యాక్సిస్మై ఇండియా, పీపుల్స్ పల్స్, కెెకెపల్స్, ఐపల్స్, మిషన్ చాణక్య, సంస్థలు వైసీపీకి మెజార్టీ వస్తుందని పేర్కొన్నాయి. పార్లమెంటు స్థానాల్లో అయితే సర్వే చేసిన ఐదు సంస్థలు పార్లమెంటు నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు వైసీపీకి వస్తాయని వెల్లడించాయి.