Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వయోజన తల్లుల పసికందుల్లో మరీ ఎక్కువ
- ఇప్పటికీ 18 ఎండ్లలోపు వివాహాలు :స్టడీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్న పసికందుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని 'స్టడీ' నివేదిక పేర్కొంది. మరీ ముఖ్యంగా పెండ్లి వయస్సు రాకముందే వివాహం జరిగిన వారికి పుట్టే పసికందులు ఎక్కువ సంఖ్యలో పోషకాహార లోపానికి గురవుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.యుక్త వయస్సులో గర్భం దాల్చిన వారికి పుట్టబోయే పిల్లలు అనేక అవలక్షణాలతో జన్మిస్తున్నారని పేర్కొంది. దీనికి కారణం తల్లి యుక్తవయస్సు ఒక కారణమైతే గర్భవతిగా ఉన్న సమయంలో సరైన పోషకాలు గల ఆహారం తీసుకోకపోవడం మరొక కారణమని నివేదిక తెలిపింది. అయితే పేద వర్గాల పిల్లలకు సరైన పోషకాహారం అందించాడానికి ఇండియా ఇప్పటికీ ఎక్కువగా కష్టపడుతోందని తెలిపింది. అనేక సర్వేల వివారాలను పోల్చి చూస్తే పిల్లలకు పోషకాహారాన్ని అందించడంలో దేశం ఇంకా వెనకబడే ఉందని నివేదిక పేర్కొనడం గమనార్హం. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించిని ఈ నివేదికలో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వయోజన తల్లులకు జన్మించిన శిశువులు పోషకాహారలోపానికి గురయ్యే అవకాశాలు 10 శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. మరో చేదు నిజం ఏమిటంటే టీనేజీలో గర్భవతులు అవుతున్న వారు ఎక్కువగా ఉన్న టాప్ 10 దేశాలలో మన దేశం కూడా ఉండటం. దేశంలో 18 ఏండ్లకంటే తక్కువగా ఉన్న బాలికలు వివాహం చేసుకోవడం నిషేధం. కానీ 2016 జాతీయ కుంటుంబ, ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం 27శాతం మంది అమ్మాయిలు 18 ఏండ్లు నిండక ముందే వివాహం చేసుకున్నారు. 31 శాతం మంది 18 ఏండ్లు నిండకముందే తల్లులయ్యారు. 'యుక్తవయస్సులో గర్భవతులు కావడం, వారి పసికందుల్లో పోషకాహారలోపాలు తలేత్తడానికి సంబంధం ఉందని ఇప్పటివరకు మేము సేకరించిన డాటా ఈ విషయాన్ని వెల్లడిస్తోందని' ఈ నివేదిక తయారి బృంద సభ్యులు సామ్యూల్ స్కాట్ అన్నారు.