Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల ఆందోళన
- మా కుటుంబాలు వైద్య బీమాకు దూరమయ్యాయి..
న్యూఢిల్లీ : రుణ సంక్షోభంలో చిక్కుకున్న 'జెట్ ఎయిర్వేస్' సంస్థ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. తమను ఆదుకోవాలంటూ మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన కార్యాలయం ముందు ప్లకార్డులు, బ్యానర్లతో నిరసనకు దిగారు. సంస్థ తమకు ఐదునెలలుగా జీతాలు చెల్లించటం లేదనీ, తమ కుటుంబాలు వైద్య బీమాకు సైతం దూరమయ్యాయనీ ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమానికి దిగిన ఉద్యోగస్తులను అడ్డుకోవ డాదనికి ఢిల్లీ పోలీస్ పెద్దఎత్తున భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. ఆందోళనను అడ్డుకోవడానికి భారీ సంఖ్యలో బారీకేడ్లు అడ్డుగా ఏర్పాటుచేసింది.ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్కు ఆపద సమయంలో మద్దతుగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం ఎదుట జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో విమానాశ్రయాన్ని చుట్టుముట్టిన ఉద్యోగులు జెట్ ఎయిర్వేస్ను కాపాడాలంటూ నినాదాలు చేశారు.
ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి..
22 వేల మంది ఉద్యోగులు ఈ సంస్థలో
పనిచేస్తున్నారని .. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎయిర్లైన్స్ను తిరిగి ప్రారంభించాలని వారు కోరారు. గత ఐదునెలలుగా వేతనాలు రావడం లేదని ఆ సంస్థ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ''జెట్ ఎయిర్వేస్పై ఎంతో మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మా ప్రధాన లక్ష్యం ఎయిర్వేస్ను కాపాడుకోవడం.. త్వరలోనే ఎయిర్లైన్స్ తిరిగి పునర్ ప్రారంభమవుతుంది'' అని ఆ సంస్థ డైరెక్టర్ అజరు హరినాథ్ సింగ్ ఓ మీడియాకు వివరించారు.