Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు
- సర్వోన్నత న్యాయస్థానానికి పూర్తిస్థాయిలో న్యాయమూర్తులు
న్యూఢిల్లీ : ఎట్టకేలకు సుప్రీంకోర్టు కొలీజియం తన పంతం నెగ్గించుకున్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నలుగురికి పదోన్నతి కల్పించే విషయమై కేంద్రం అభ్యంతరాలు తెలిపిన్పటికీ తాము సిఫారసు చేసిన వారే సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతిని పొందనున్నారు. దీంతో సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులుగా అనిరుద్దబోస్, ఎఎస్ బోపన్న, భూషణ్ రామకృష్ణ గవారు, సూర్యకాంత్ లు త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నలుగురికి పదోన్నతులతో ఐదేండ్లలో తొలిసారిగా పూర్తిస్థాయి న్యాయమూర్తులను సర్వోన్నత న్యాయస్థానం కలిగి ఉండనున్నది. సుప్రీంకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా, ప్రస్తుతం 27 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే విషయమై జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి అనిరుద్దబోస్, గౌహతి హైకోర్టు జడ్జీ బోపన్న ల పేర్లను కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. వారి సీనియారిటీని సాకుగా చూపుతూ వారి పేర్లను కేంద్రం తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చుతూ మళ్లీ వారి పేర్లనే సూచిస్తూ కొలీజియం సిఫారసు చేసింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు న్యాయమూర్తి బి ఆర్ గవారు, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్లకు కూడా సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతులు కల్పించాలని సీజేఐ రంజన్ గొగోరు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టుకు జడ్జీలుగా పనిచేసిన దళిత న్యాయమూర్తుల్లో గవారు మూడోవారు కానున్నారు. 2025లో సీజేఐ పదవికి రేసులో గవారు పేరు ఉన్నది. దళిత వర్గానికి చెందిన కేజీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టుకు సీజేఐగా పనిచేశారు. గవారు కూడా సీజేఐ అయితే బాలకృష్ణన్ తర్వాత ఆయన రెండోవారు కానున్నారు.