Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీ తీరుపై ఆర్జేడీనేత తేజస్వి విమర్శలు
పాట్నా : బీహార్లో బాల కార్మికులతో ఈవీఎంలు మోయిం చారని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను ఆయన సామాజిక మాధ్యమాలలో పంచుకుంటూ ఈసీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇద్దరు చిన్నారులు ఈవీఎంలను మోస్తున్న ఫోటోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేగాక ఈవీఎంలను గుర్తింపు లేని వాహనాలలో తరలించారని ఆరోపించారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమైనా ఈసీ మాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం యూపీ, బీహార్, పంజాబ్, హర్యానాలలో పలుచోట్ల ఈవీఎంలు తరలించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ఆరోదశ పోలింగ్ సందర్భంగా ముజఫర్పూర్లోని ఓ హౌటల్లో ఈవీఎంలను భద్రపరిచారని.. ఇది జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే జరిగిందని తేజస్వి ఆరోపించారు.